జగన్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోతిరెడ్డి ప్రాజెక్టు పనులు తెలంగాణ సర్కార్ ఫిర్యాదుతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేసిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి మధ్య భారీగానే మాటల యుద్ధం జరగటమే కాక గొడవ కేంద్ర జల వనరుల శాఖ దాక వెళ్ళింది.
దీంతో అన్ని పరిస్థితులను బేరీజు వేసిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు ఆపివేయాలని కేంద్రం ఏపీ సర్కార్ కి తెలపటంతో జగన్ సర్కార్ పోతిరెడ్డిపాడు పనులను మొన్నటిదాకా ఆపేయటం జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే సమయంలో నోటీసులు ఇవ్వటంతో పనులు మొత్తానికి ఆగిపోయాయి. ఇదిలాఉంటే నోటీసులు ఇచ్చినా గానీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను యధావిధిగా చేసుకుంటూ పోతుంది అంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్రానికి చెందిన కొంతమంది అక్కడ ఫోటోలు తీసి వాదనను వినిపించి మళ్లీ ఈ విషయాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో సవాల్ చేయడం జరిగింది.
దీంతో ఏపీ ప్రభుత్వం తరఫున లాయర్ వెంకటరమణ వాదనలు వినిపించారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు దగ్గర జరుగుతున్నది నిర్మాణ పనులు కాదు, భూసార పరీక్షలు జియాలాజికల్ పరీక్షలు డీపీఆర్ తయారీ కోసం సాధారణ పనులు మాత్రమే వ్యవహరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే గతంలో కొన్ని ప్రభుత్వాలు ఈ విధంగానే పనులు చేసుకుంటూ ప్రాజెక్టులను నిర్మించి చేసి వాటి వాదనలు తీర్పులు వచ్చేసరికి న్యాయస్థానాలు కట్టిన డ్యాములు పడగొట్టే విధంగా తీర్పులు ఇవ్వలేని పరిస్థితి ఉండటం జరిగింది. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో కూడా ఇదే రీతిలో జరిగింది. సరిగ్గా ఈ ఎత్తుగడ పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్ సర్కార్ వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులు మాత్రం సైలెంట్ గా జగన్ సర్కార్ చేసుకుంటూ పోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు గట్టిగా వస్తున్నాయి.