Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఇవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. తొలుత చేబ్రోలులోని నివాసం నుండి ఆయన బయలు దేశారు.
పవన్ నామినేషన్ సందర్భంగా జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. చేబ్రోలు నుండి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వరకూ ర్యాలీ కొనసాగింది. అనంతరం పవన్ ప్రత్యేక కాన్వాయ్ లో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు.
పవన్ వెంట టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, నాగబాబు, బీజేపీ, టీడీపీ నేతలు ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ నా కోసం టికెట్ త్యాగం చేశారని అన్నారు. వీరు భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాననీ, ఇందుకు తన సహకారం ఉంటుందని చెప్పారు.
పిఠాపురం అభివృద్ధి కోసం కలిసి కట్టుగా పని చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ ఎన్నికలు చాలా కీలకమని అన్నారు. రాష్ట్రంలో జనసేన బాగా పుంజుకున్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగాలకు సిద్దపడినట్లుగా చెప్పారు. ఇటు జనసేన, అటు టీడీపీలో నేతలు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇది వ్యక్తుల కోసం కాదని ప్రజల భవిష్యత్తు కోసమేనని అన్నారు.
AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ యే ముద్దు