Jathi Rathnalu Trailer : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి , మణిదీప్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కామెడీ ఇంటెర్ట్రైనెర్ జాతిరత్నాలు.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు.. ఈ ట్రైలర్ ను చూసిన ప్రభాస్ పది సార్లు నవ్వానని.. ఇంక సినిమా ఎలా ఉంటుందో అర్ధం అవుతోందని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు.

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ చిత్రంలో ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇప్పటివరకు వచ్చిన పోస్టర్ లో టీజర్ పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలు పెంచుతూనే వచ్చాయి . జాతి రత్నాలు ట్రైలర్ ను లాంచ్ చేసిన ప్రభాస్ ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైంది అన్నప్పుడే ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈనెల 11వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు..