అధికార పార్టీలో ఉంటే ఏదో ఒకటి గిట్టుబాటు అవుతుందన్న ఆశతో పొలోమని వైసీపీలో చేరిన టిడిపి మాజీల పరిస్థితి మరి దారుణంగా వుందట.
చేర్చుకోవడం అయితే వెంటనే చేర్చేసుకున్న జగన్ వారికి పార్టీలో ప్రాధాన్యం లేదా పదవి ఇచ్చే యోచనలోనే లేరట. మొన్నటి ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోయాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైసీపీ పంచన చేరారు.ముగ్గురు టిడిపి ఎమ్మెల్యేలు కూడా వైసిపికి మద్దతు ప్రకటించారు.వాస్తవ పరిస్థితి చూస్తే ఆ టిడిపి ఎమ్మెల్యేలకే వైసీపీలో ప్రాధాన్యం లేని పరిస్థితి.చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం తన కుమారుడికి చీరాల నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి పదవిని ఆశించి అధికార పార్టీ వైపు వెళ్లారు.
అది జరిగే అవకాశాలే లేవు.మరో ఇద్దరు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మద్దాలి గిరి పరిస్థితి కూడా వైసీపీలో ఏమాత్రం కంఫర్ట్బుల్గా లేదు.వీరిని పక్కన బెడితే టిడిపి మాజీ ఎమ్మెల్యేలు పలువురు వైసిపి తీర్థంపుచ్చుకున్నారు.వీరిలో శిద్దా రాఘవరావు కదిరి బాబూరావు, రెహమాన్ ,దేవినేని అవినాష్ పంచకర్ల రమేష్బాబు,తిప్పల గురుమూర్తిరెడ్డి ,చింతలపూడి వెంకటరామయ్య తదితర ప్రముఖులున్నారు.టీడీపీలో మంచి స్థానాల్లో ఉన్న వీరు ఎన్నికల్లో ఓడగానే వైసీపీ పంచన చేరారు. అధికార పార్టీలోకి వస్తే తమకు తగిన గౌరవం పదవులు దక్కుతాయని ఎంతో ఆశించారు.కానీ అలాంటి వాతావరణమే వైసిపిలో లేదని స్పష్టంగా గోచరిస్తుంది.
నిజానికి వైసీపీలోనే పదేళ్ల పాటు కష్టపడిన వారికి ఇపుడు కనీసం నామినేటెడ్ పదవి లేదు, చాలా మంది ఆశావహులకు నాడు ఎన్నికల్లో టికెట్లు జగన్ ఇవ్వలేదు, వారిని ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేస్తానని అప్పట్లో జగన్ప్రామిస్ చేశారు. కానీ జరిగింది వేరు. పదవులన్నీ సామాజిక సమీకరణలతో చాలా మందికి దక్కలేదు. ఇక జగన్ బీసీ మంత్రంతో కూడా అనేక మంది అవకాశాలు కోల్పోయారు. మరి కొన్ని చోట్ల పదవులకు ఎక్కువమంది పోటీ పడడంతో ఎవరికీ దక్కకుండా పోయాయి.
ఇలా వైసీపీలో పదవుల గోల ఓ రేంజిలో ఉంది. కానీ ఇపుడు వీరికి తోడు అంటూ పొలోమంటూ కొత్తవారు టీడీపీ, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి వచ్చేశారు.వీరందరికీ జగన్ఏం పదవులు ఇవ్వగలరు అన్నది జవాబు దొరకని ప్రశ్న. దీంతో వైసీపీలో చేరిన వారు ఇతర పార్టీల వారు తమకు చెయిరు దొరకడం లేదని ఆవేదన ఆవేదన చెందడం మినహా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు.