Kavitha: కొద్ది రోజుల క్రితం కవిత కొడుకు కరోనా బారిన పడి మరణించడం తెలిసిందే. తాజాగా ఆమె భర్త దశరథ్ కూడా కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటూ మరణించడం జరిగింది. ముందు కొడుకు ఆ తర్వాత భర్త మరణించడంతో కవిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలో సెలబ్రిటీలు తాజా ఘటన పై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కవిత అనేక పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించడం జరిగింది. సినిమాల పరంగా మాత్రమే కాక రాజకీయపరంగా కూడా కవిత ప్రముఖ పార్టీలలో జాయిన్ అయ్యి క్రియాశీలకంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న టైంలో కవిత చాలా యాక్టివ్ గా.. ఉండేవారు. దక్షిణాది సినిమా రంగంలో అనేక భాషలలో నటించిన కవిత.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అడపాదడపా సినిమాలు చేస్తూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తూ ఉంది. అటువంటి కవిత కుటుంబంలో ఒకేసారి కొడుకు భర్త చనిపోవడంతో ఇండస్ట్రీ లో ఈ వార్త పెద్ద హాట్ టాపిక్ అయింది.
Reda more: Kavitha: కవిత ఏంటి… ఇలా మాట్లాడేసింది?
కరోనా సెకండ్ వేవ్.. వల్ల చాలామంది ప్రముఖులు మరణించడం జరిగింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కెల్లా ఇండియా కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం జరిగింది. ఒక్కసారిగా ఊహించని విధంగా మహమ్మారి విజృంభించడంతో ఆక్సిజన్ సిలిండర్లు అందక.. చాలామంది మరణించడం జరిగింది. ఇండస్ట్రీలో టాప్ హీరోలు సైతం కరోనా బారిన పడటం జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ కూడా ఈ మహమ్మారి నుండి తప్పించుకోలేక పోతున్నారు. అటువంటి ఈ కరోనా ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వాలు ఊపిరి పీల్చుకున్నాయి. కాగా కవిత కుటుంబంలో.. కొడుకుని భర్తని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకోవటం తో… కవిత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!