Khusbhu: సీనియర్ యాక్టర్ కుష్బూ అందరికీ తెలుసు. అప్పట్లో నాగార్జునతో “రక్షకుడు” అనే సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాటలు అప్పట్లో హైలెట్. టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, నాగార్జునతో ఇంకా చాలా మంది హీరోలతో నటించిన ఖుష్బూ.. అక్కినేని ఫ్యామిలీ తో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ మొదలుకొని బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు సమంత నాగచైతన్య విడాకుల వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.
పెళ్లి చేసుకున్న నాలుగు సంవత్సరాలకే వీరిద్దరూ విడిపోవడం పట్ల.. అభిమానులతో పాటు నెటిజన్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు రకరకాలుగా.. ఈ వ్యవహారం పై స్పందిస్తూ అన్నారు. ప్రకాష్ రాజ్, రామ్ గోపాల్ వర్మ.. నాగార్జున ఇంకా చాలామంది వెరైటీ గా రియాక్ట్ అయ్యారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఈ వ్యవహారంపై కుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె ఏమన్నారంటే భార్యాభర్తల మధ్య.. జరిగేది ప్రతిదీ వారిద్దరిదీ కి సంబంధించి.. మరొకరి ప్రమేయం ఉండదు.
వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి
ఈ క్రమంలో వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రవేశించండి అందరు గౌరవించాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో అటువంటి పరిస్థితుల నుండి బయట పడటానికి వాళ్ళకి కాస్త సమయం ఇవ్వాలి. మరింతగా అర్థం చేసుకుని.. ఇటువంటి విషయాలపై లేనిపోని అనవసరమైన ఊహాగానాలు.. రూమర్స్ క్రియేట్ చేయకూడదని కుష్బూ స్పందించారు.
నిజం కాకపోతే చాలా బాగుండు
మరోపక్క ఈ జంటని ఎంతో ఇష్టపడే అక్కినేని అభిమానులు అదే రీతిలో సామాన్య నెటిజనులు ఈ వార్త నిజం కాకపోతే చాలా బాగుండు అని అంటున్నారు. కానీ సమంత నాగ చైతన్య ఇద్దరం బాగా చర్చించి విడాకులు తీసుకున్నట్లు భవిష్యత్తులో స్నేహంగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకునే రీతిలో ఉంటామని సోషల్ మీడియా వేదికగా తెలపడంతో ఎవరు ఏమి మాట్లాడ లేక పోతున్నారు.