విజయవాడ, జనవరి 18: ఆయేషా మీరా హత్య కేసులో మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. గూడవల్లిల్లోని ఆతని గృహంలో సిబిఐ అధికారులు సతీష్ను ప్రశ్నిస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని దుర్గా హాస్టల్లో పదేళ్ల క్రితం ఆయేషా మీరా హత్యకు గురైంది. ఈ హాస్టల్ నిర్వహకులు కోనేరు సతీష్కు సన్నిహితులు. హతురాలి తల్లి షంషాద్ బేగం తొలి నుండి కోనేరు సతీష్ అతని స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
previous post
next post