అమరావతి, జనవరి 18: ఓటర్ల జాబితాపై ఎలాంటి సందేహాలు ఉన్నా తెలియజేయాలని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వివిధ రాజకీయ పార్టీల నేతలను కోరారు.
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో టిడిపి, వైసిపి, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.