Lions Saved Girl: 2005లో అంతర్జాతీయ వార్తా సంస్థలు అయిన బీబీసీ, గార్డియన్ ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో ఇప్పుడు మరొకసారి వైరల్ అవుతుంది. నైరుతి యూతోపియాలో గుర్తుతెలియని దుండగులు 12 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అప్పటికే ఓ వ్యక్తి ఆ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడట. అది చుసిన ఆ బాలిక ఆ అడవిలో ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టగా మూడు సింహాలు వెంటనే అక్కడికి వచ్చాయట. ఆ సింహాలు వారిని తరిమికొట్టి భయంతో వణికిపోతున్న ఆ బాలిక వద్దే మూడు రోజులు కూర్చొన్నాయట.
అయితే వారం రోజుల తర్వాత పోలీసులకు ఆ దుండగులు ఆచూకీ తెలియడంతో ఆ బాలిక కోసం గాలిస్తూ అడవిలోకి వెళ్లగా అక్కడ పోలీసులు ఇది చూసి ఆశ్చర్యపోయారట. ఈ సందర్భంగా ఓ పోలీస్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము అక్కడికి చేరేసరికి ఆ సింహాలు బాలికకు రక్షణ కల్పించడం చూసాం అలాగే మేం అక్కడికి వెళ్లిన తర్వాత ఆ సింహాలు ఆ చిన్నారిని అక్కడే వదిలి వెళ్లిపోయాయి’’ అని తెలిపారు.
ఇన్ని సంవత్సరాలకి కూడా ఈ ఘటన ఇంకా మిస్టరీ గానే మిగిలిపోయింది. అప్పటిలో ఏకంగా అంతర్జాతీయ మీడియ సంస్థలు కూడా ఈ కథనాన్ని ప్రచురించాయి. ఇంతకీ ఆ సింహాలు ఆమెను ఎందుకు చంపలేదు అనేది ఎవ్వరికీ అంతుచిక్కట్లేదు.
ఈ ఘటన పై కొందరు జంతు నిపుణులు మాట్లాడుతూ “బహుశా మూడు రోజుల తరువాత ఆమెను ఆ సింహాలు దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అక్కడికి వెళ్ళి ఉంటారని అంతమంది పోలీసులను చూడగానే అవి ఆమెను వదిలి వెళ్ళిపోయి” ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా మరో నిపుణుడు “ఆ సింహాలకు ఆ బాలిక ఏడుపు కేకలు సింహ పిల్లల ఏడుపులా అనిపించి ఉండవచ్చని కాబట్టి అవి ఆమెను ఏమి చెయ్యకుండా దుండగుల నుంచి రక్షించి అన్ని రోజులు కాపలా కాసి కాపాడాయని తెలిపారు.