ఓ అధ్యయనం ఒంటరితనాన్ని అనుభవిస్తున్న పురుషుల్లో కంటే మహిళలలో మానసిక సమస్యలు, గుండె జబ్బులతో పాటు త్వరగా చనిపోయే ప్రమాదాలు ఎక్కువని తేల్చింది.
ఒంటరితనం మహిళల్లో అధిక రక్తపోటును పెంచుతుందని ఒక అధ్యయనం సూచించింది. ఈ పరిశోధనను బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు చేపట్టారు మరియు ఇటీవల జర్నల్ ఆఫ్ హైపర్టెన్షన్లో ప్రచురించారు. ఒంటరితనం పురుషులు మరియు మహిళలలో అధిక రక్తపోటు మరియు అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అని ఈ అధ్యయనం కనుగొంది.
ఒంటరిగా జీవించే మధ్య వయస్సు మరియు వృద్ధ మహిళలు పురుషుల కంటే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు అని ఈ అధ్యయనం కనుగొంది. పురుషులతో పోలిస్తే ఒంటరి మహిళలలు గుండె జబ్బులు, స్ట్రోక్ తో త్వరగా మరణిస్తున్నారని ఈ అధ్యయనం తెలిపింది.
పురుషులలో ఇది చాలా భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్ తో ఉంటూ పెద్ద సోషల్ నెట్వర్క్ ఉన్నవారికి రక్తపోటు అత్యధిక స్థాయిలో మరియు చిన్న నెట్వర్క్ కలిగి ఒంటరిగా నివసించే వారికి రక్తపోటు తక్కువ స్థాయిలో ఉంటుందని నిపుణులు ఈ పరిశోధన వలన కనుగొన్నారు.
వితంతువు లేదా ఒంటరి జీవనం సాగిస్తున్న మహిళలలో సిస్టోలిక్ రక్తపోటును గుర్తించారు. వివాహిత స్త్రీలతో పోలిస్తే ఒంటరి మహిళలలో రక్తపోటు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పరిశోధనలో ఒంటరి, వితంతువు, విడాకులు తీసుకున్న స్త్రీలలో ఉదర మరియు ఊబకాయ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అదే పురుషులు ఒంటరిగా నివసిస్తుంటే వారికి ఊబకాయ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.