Mahesh babu: టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఉన్న క్రేజ్ అండ్ పాపులారిటీ అందరికీ తెలిసిందే. ఆయన పక్కా కమర్షియల్ హీరో అని ఆయన సినిమాలే చెబుతున్నాయి. బాలీవుడ్లో అక్షయ్ కుమార్ మాదిరిగా వరుసగా టాలీవుడ్లో బ్లాక్ బస్టర్స్ అందుకుంటున్న హీరో అంటే ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్న పేరు మహేశ్ బాబు, ఆయన గత చిత్రం సరిలేరు నీకెవ్వరు తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా సినిమాతో రావాలనుకున్నారు.
కానీ, కరోనా వేవ్ కారణంగా లాంగ్ గ్యాప్ రాక తప్పలేదు. మహేశ్ ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వాస్తవంగా చూస్తే ఈ పాటికే వచ్చేయాలి. కానీ, సంక్రాంతికి అటు నుంచి ఏప్రిల్కు పోస్ట్పోన్ అయింది. ఇంత లాంగ్ గ్యాప్ అంటే మహేశ్ అభిమానులు కష్టమే అంటున్నారు. ఇక మహేశ్ వరుసగా ఒకే ఏడాది రెండు సినిమాలను రిలీజ్ చేసి ఎంత కాలమయిందో. అదీ కాక ఇప్పుడు అందరూ పాన్ ఇండియన్ స్టార్గా క్రేజ్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు.
Mahesh babu: బాలీవుడ్ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారు.
అంతేకాదు, బాలీవుడ్ మార్కెట్ మీద గట్టిగా ఫోకస్ పెడుతున్నారు. కానీ, మహేశ్ ఒక్కడే ఇంకా ఆ దిశగా సన్నాహాలు చేయడం లేదనేది టాక్. బాలీవుడ్ సినిమా చేయాలంటే ముందు రాజమౌళి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాల్సిందే అనేది మరో ఆలోచన. ఆయన సినిమాతో బాలీవుడ్లో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. అందుకే మహేశ్ రాజమౌళి సినిమా పూర్తయ్యాక బాలీవుడ్ మీద దృష్ఠిపెడతారని చెప్పుకుంటున్నారు. ఇక సినిమాలు కూడా ఇంత గ్యాప్ రాకుండా చూసుకుంటే
బావుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!