ఐదు ప్రధానదేశాల జాతీయ ఆర్థిక వ్యవస్థల అనుబంధానికి సంక్షిప్త రూపమే, బ్రిక్స్.ఈ ఐదు దేశాలు కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య తదితర అంశాలపై విస్తృత స్థాయిలో చర్చిస్తుంటాయి. ఈ సదస్సులో ఐదు దేశాలు అయినా బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్ చెందిన దేశాధినేదలు పాల్గొంటూ వుంటారు. 2009 నుండి, బ్రిక్స్ దేశాలు ఏటా అధికారిక శిఖరాగ్ర సమావేశాలలో కలుస్తున్నాయి. ఈ ఏడాది బ్రిక్స్ 12వ శిఖరాగ్ర సమావేశం జరిగింది.ఈ సమావేశం మొదట సెయింట్ పీటర్స్బర్గ్లో జూలై 21 నుండి 23, 2020 వరకు జరగాల్సి ఉంది,కానీ ప్రపంచ కోవిద్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా విర్చువల్ ద్వారా జరిగిన ఈ సదస్సులో భారత్తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా నేతలు పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.
బ్రిక్స్ సమావేశంలో ముఖ్య విషయాలు:
రష్యా అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో బ్రిక్స్ దేశాలు అన్ని కల్సికట్టు గా పని చేయాలి అన్ని పిలుపునిచ్చారు. రష్యా కి చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఇప్పటకే, మూడోవ దశ ట్రైల్స్ లో ఉన్నట్లు అయినా తెలిపారు. ఈ టీకాను భారత్ చైనాలో ఉత్పత్తి చేయవచ్చునని ఇప్పటికే ఔషధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. భారత్ లో ఇప్పటికే వీటి ఒప్పందాలు కుదిరాయి అని చెప్పారు. అలాగే రెండేళ్ల క్రితమే బ్రిక్స్ నిర్ణయించిన ప్రకారం వ్యాక్సింగ్ కోసం పరిశోధన అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఆ తరువాత మన దేశ ప్రధాని ఉగ్రవాదం, కొవిడ్-19 సంక్షోభం, ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలు తదితర కీలక అంశాలపై సమావేశంలో మాట్లాడారు. భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మోదీ ఈ సదస్సులో పాల్గొని ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సున్నితమైన అంశాలను తనదైన శైలిలో ప్రస్తావిస్తూ కీలక సూచనలు చేశారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో భారత్కు ప్రాతినిధ్యం పెరగాల్సిన అవసరాన్ని చెప్పకనే చెప్పారు.ఉగ్రవాదం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదులకు ఊతమిస్తున్న దేశాలను దోషులు గా నీళ్ళబెట్టాలి అన్ని అయినా చెప్పారు.ఇటువంటి దేశాలపైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వంటివి కొత్త ఆలోచనలు చేయాలి అన్ని, కాలానుగుణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్ని అయినా తెలిపారు. కరోనా టీకా ప్రజలకు అందచేయడంలో భారత్ సిద్ధంగా ఉంది అన్ని అన్నారు.
కరోనాకు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడంలో భారత్ కు బ్రిక్స్ లోని ఇతర దేశాలకు తమ సహాయం అందిస్తామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తెలిపారు. కరోనా ను ఆరికట్టడానికి, సాంప్రదాయ వైద్యం ఎంతో ఉపయోగపడుతుంది అన్ని, దాన్ని గురించి చర్చించడానికి బ్రిక్స్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసింది గా అయినా కోరాడు. చైనా లో కనుగొన్న కొన్ని వ్యక్సిన్ లు చివరి దశ లో ఉన్నట్లు, రష్యా, బ్రెజిల్ లో కూడా ఈ టీకాలకి సంబంధించి ట్రైల్స్ జర్గుతున్నట్లు అయినా తెలిపారు. భరత్ చైనా మధ్య ఉన్న సరిహద్దు విషయంలో ఉన్న గొడవలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం అన్ని చైనా అధ్యక్షుడు తెలిపారు.
ఈ సమావేశం లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫాసో, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బాల్సనరో పాల్గొన్నారు