ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కమిటయిన మూడు ప్రాజెక్ట్స్ కూడా భారీ బడ్జెట్ సినిమాలే. ఒక్కో సినిమా బడ్జెట్ 300 కోట్ల కి పైగానే. ప్రతీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకున్నాడు. ఒక్కో కథ సంబంధం లేని విషయంగా సినిమాలు ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు కమిటయిన ప్రాజెక్ట్స్ కంటే తాజాగా ప్రకటించిన సలార్ అన్న కొత్త సినిమా గురించే అంతటా తీవ్రమైన చర్చలు సాగుతున్నాయి. నిర్మాతలకి ప్రభాస్ మైండ్ సెట్ ని అర్థం చేసుకోలేకపోతున్నారట.
ఇప్పటికే రాధే శ్యామ్ అన్న సినిమా చేస్తున్నాడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఫైనల్ షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలైనట్టు సమాచారం. ఈ షెడ్యూల్ తో సినిమా కంప్లీట్ అవుతుంది. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పీరియాడికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇక ఈ సీమా తర్వాత వాస్తవంగా వైజయంతీ మూవీస్ లో ప్రభాస్ నటించాల్సి ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా వైజయంతీ మూవీస్ నిర్మించే 50 వ సినిమా కావడంతో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ మరో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ ని వెనక్కి నెట్టి ఆదిపురుష్ వచ్చి చేరింది.
కాని తాజాగా ప్రకటించిన ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ల సలార్ ఇప్పుడు ఆదిపురుష్ ని కూడా వెనక్కి నెట్టింది. నిన్నా మొన్నటి వరకు నాగ్ అశ్విన్ సినిమా కంటే ముందు ఆదిపురుష్ సెట్స్ మీదకి వస్తుందని ప్రచారం జరగగా ఇప్పుడు జనవరి నుంచి సలార్ మొదలవబోతుందని మేకర్స్ వెల్లడించారు. అయితే ఇది భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే సినిమా కాబట్టి ప్రభాస్ ముందు సలార్ మొదలు పెట్టాలని డిసైడయ్యాడట. ఇక ఆదిపురుష్ .. నాగ్ అశ్విన్ సినిమాలు వీఎఫెక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వెనక్కి నెట్టినట్టు తెలుస్తోంది.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!