త్వరలో బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు అధికారం కోసం అనేక వ్యూహాలు వేస్తున్నాయి. ఎక్కువగా పోటాపోటీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా బిజెపి పార్టీకి మధ్య నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ఇటువంటి తరుణంలో మొన్నటి వరకూ మజ్లిస్ పార్టీతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు రాగా తాజాగా జరిగిన సంఘటన బట్టి రెండు పార్టీలు వేరు వేరు గానే పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
పూర్తి విషయంలోకి వెళితే బెంగాల్ రాష్ట్రంలో బెంగాల్ మజ్లిస్ రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడు ఎస్ కే అబ్డుల్ కలం తన అనుచరులతో కలిసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతాబెనర్జీ ఆధ్వర్యంలో జాయిన్ అవటం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి దీదీ ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. ముఖ్యంగా మజ్లిస్ పార్టీ బిజెపి పార్టీ కనుసన్నల్లో నడుస్తున్నట్లు మమతా బెనర్జీ నీ దెబ్బ వేయటానికి బెంగాల్ లో పోటీ చేస్తున్నట్లు తాజాగా వార్తలు వస్తున్న తరుణంలో మజ్లిస్ పార్టీ రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడు మమతా బెనర్జీ పార్టీలో చేరటం తో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది.
ఇదిలా ఉండగా బీజేపీ పార్టీ తో కలసి అడుగులు వేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలను మజ్లిస్ అధినేత అసద్ ఖండిస్తున్నారు. ఇదిలా ఉంటే మార్చి ఏప్రిల్ మధ్యలో జరగబోయే బెంగాల్ ఎన్నికల్లో ఏదోవిధంగా గెలవాలని .. బీజేపీ భారీ స్థాయిలో వ్యూహాలు వేస్తుంటే, మమతా బెనర్జీ పట్టు నిలుపుకోవడం కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో గెలవడంతో బెంగాల్ ఎన్నికల్లో కూడా గెలవాలని కమలనాథులు పశ్చిమ బెంగాల్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.