బీజేపీ తన మీద సస్పెన్షన్ ఎత్తి వేయకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. శుక్రవారం మంత్రి హరీష్ రావు తో రాజాసింగ్ భేటీ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరతాడంటూ పుకార్లు షికారు చేశాయి. ఈ పుకార్లపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. అయితే దూల్ పేట ఆసుపత్రి ఆధునీకరణ విషయంలో మాత్రమే హరీష్ రావును తాను కలిశాను అని చెప్పారు రాజాసింగ్. తన రక్తంలోనే బీజేపీ ఉందని, బీజేపీ పార్టీనే వదిలే ప్రసక్తే లేదని అయన స్పష్టం చేశారు. బీజేపీ తన మీద సస్పెన్షన్ ఎత్తి వేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజా సింగ్ అన్నారు.
MLA Raja Singh: మంత్రి హరీష్ రావుతో ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ .. కారెక్కేందుకేనా అంటూ కామెంట్స్
రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేయాలని గత రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ పలు మార్లు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసినా స్పందించలేదు. అయితే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య విభేదాలు ఉన్నాయి. ఆ కారణంగానే రాజాసింగ్ సస్పెన్షన్ వెనుక కిషన్ రెడ్డి ఉన్నారంటూ కూడా గతంలో ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ సస్పెన్షన్ ఎత్తివేతపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది అనుమానమే అన్న మాట వినబడుతోంది.
Supreme Court: ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టులో బిగ్ షాక్ ..ఇసుక తవ్వకాలకు బ్రేక్ ..Sand Quarrying!