Tollywood : కరోనా దెబ్బకి టాలీవుడ్ క్యాలెండరే మారిపోయింది. ఎప్పుడు రిలీజ్ కావాల్సిన ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్మాతలే క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితులు ఎదురై ఎన్నో ఏళ్ళు అవుతోంది. అంతేకాదు మరీ ఇలాంటి దారుణమైన ఆర్ధిక నష్టం ఇండస్ట్రీకి వస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. 2020 – 2021 లో చూసుకుంటే సినిమా ఇండస్ట్రీకి కొన్ని వేల నష్టం. సినిమాలు ఓపెనింగ్ అయిన వాటి నుంచి రిలీజ్ కావాల్సిన వాటిలో చాలా వరకు సగంలో ఆగిపోయినవే. ఇక 2021 మార్చ్ తర్వాత ప్లాన్ చేసుకున్న సినిమాల రిలీజ్ డేట్స్ మొత్తం మళ్ళీ రీ షెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
కరీనా సెకండ్ వేవ్ తగ్గుతున్న తరుణంలో ఎన్నో ఆశలు పెట్టుకొని మళ్ళీ నిర్మాతలు ల్యాబ్ నుంచి సినిమాలను బయటకు తీసుకు వచ్చేందుకు డేట్స్ షెడ్యూల్ చేసుకుంటున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ కావాల్సిన నాగ చైతన్య – సాయి పల్లవి – శేఖర్ కమ్ముల లవ్ స్టోరి పూర్తి స్థాయిలో థియేటర్స్ సామర్థ్యం ఉన్నపుడే రిలీజ్ చేస్తామని సునీల్ నారంగ్ వెల్లడించారు. అంటే అది జూలై లేదా ఆగస్టు అని తెలుస్తోంది. రానా విరాట పర్వం కూడా ఆగస్టులో రిలీజ్ చేయనున్నారట. ఇక పుష్ప పార్ట్ 1 ఆగస్టు 13న రిలీజ్ అన్నారు.
Tollywood : వీటిలో ఎన్ని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
నాని నటించిన టక్ జగదీష్, రిలీజ్ కి రెడీగా ఉండగా ఆగస్టు చివరిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. రవితేజ ఖిలాడి, బాలయ్య అఖండ సినిమాలను ఆగస్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. వీటితో పాటు మరికొన్ని చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని సినిమాలు ఒక్క ఆగస్టులో వస్తే థియేటర్స్ సమస్య రాదా అన్నది విశ్లేషకుల మాట. వీటిలో ఎన్ని రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తారన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మరో నెల రోజులు గడిస్తే గానీ టాలీవుడ్ సినిమాల పరిస్థితేంటన్నది చెప్పలేము. ఇక ఒకే నెలలో పదేసి సినిమాలు వచ్చినా లాభాలు ఎవరికి దక్కుతాయన్నది ఎవరూ అంచనా వేయలేరు.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!