Double Ismart: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ “డబుల్ ఇస్మార్ట్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంలో మార్చి 8వ తారీకు 2024లో విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావటంతో విడుదల తేదీ జూన్ కి వాయిదా వేయటం జరిగింది. 2019లో “ఇస్మార్ట్ శంకర్” రిలీజ్ అయ్యి… సూపర్ డూపర్ హిట్ అయింది. వరుసపరాజయాలలో ఉన్న రామ్ మరియు పూరి జగన్నాథ్ కి “ఇస్మార్ట్ శంకర్” మంచి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా “డబుల్ ఇస్మార్ట్” చిత్రీకరిస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ కథ ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ గురించి పూరి కొడుకు యువ హీరో ఆకాష్ పూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. “డబుల్ ఇస్మార్ట్” సినిమా కోసం నేను కూడా ఎదురు చూస్తున్న. ఈ సినిమా షూటింగ్ అయితే చాలా వేగంగా జరుగుతుంది. మొన్ననే రఫ్ గా “డబుల్ ఇస్మార్ట్” టీజర్ చూశానని కామెంట్లు చేశారు.
టీజర్ అమేజింగ్ గా ఉందని రామ్ అభిమానులకు అయితే ఈ టీజర్ ఒక పండగ లాగా ఉంటుందని ఆకాష్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. నేను చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ “డబుల్ ఇస్మార్ట్” గురించి సరికొత్త అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ఇప్పుడప్పుడే తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేసేది లేదని చెప్పారు. కొత్తగా తాను కథలు వింటున్నట్లు.. త్వరలోనే.. కొత్త ప్రాజెక్టులను ప్రకటిస్తానని ఆకాష్ పూరి స్పష్టం చేశారు. “లైగర్” పరాజయంతో పూరి కెరియర్ మళ్లీ డేంజర్ జోన్ లో పడింది. దీంతో “డబుల్ ఇస్మార్ట్”తో హిట్ కొట్టాలని పూరి అభిమానులు ఆశిస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!