Animal Movie OTT Release: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో గత ఏడాది విడుదలైన “యానిమల్” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నీ చాలా వెరైటీగా చూపించడం జరిగింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ సినిమాగా నిలిచింది. ఏకంగా ఈ సినిమా ₹800 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. రణబీర్ కపూర్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ విడుదలపై గత కొన్నాళ్ల నుండి సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ క్రమంలో జనవరి 26న ఓటీటీలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఊహించని విధంగా “యానిమల్” సినిమా పై వివాదం తలెత్తింది. ఓటీటీ విడుదల నిలిపివేయాలని కోర్టులో చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకరైన సినీవన్ స్టూడియోస్ పిటిషన్ వేయడం జరిగింది. దీంతో జనవరి 26వ తేదీన ఓటీటీ విడుదల సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈ అంశంపై ఈ నెల 22న ఢిల్లీ న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హాజరైన సినీ వన్ స్టూడియోస్, టీ సిరీస్ సంయుక్తంగా అవగాహన ఒప్పందానికి ఓకే చెప్పినట్లు విరుపక్షాల తరఫున సీనియర్ న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
ఈ ఒప్పందాన్ని కోర్టుకు సమర్పించేందుకు కూడా అంగీకరించారు. వారి మధ్య అవగాహన ఒప్పందం కుదరటంతో “యానిమల్” ఓటీటీ రిలీజ్ కి సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓటీటీ రిలీజ్ కి సంబంధించి “సలార్” టీమ్ తో ట్విట్టర్ లో జరిగిన చిట్ చాట్ లో “యానిమల్” టీం హింట్ ఇవ్వడం జరిగింది. తిరంగ జెండాకు సెల్యూట్ చేస్తున్నట్లు.. ఎమోజీని ట్వీట్ చేయడం జరిగింది. దీంతో ఈ రిపబ్లిక్ డేకి సినిమా రిలీజ్ కాబోతున్నట్లు చెప్పకనే చెప్పింది. అయితే ఈ కేసును మరోసారి జనవరి 24న విచారించనున్నారు. కాగా ఈ సినిమాను ఓటీటీలో… మూడు గంటల 29 నిమిషాల రన్ టైం ఉండనుంది. సినిమా థియేటర్లో కంటే మరో ఎనిమిది నుంచి పది నిమిషాలపాటు సీన్స్ అదనంగా చేర్చడం జరిగింది.