తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికి నాలుగు సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. అనేక మంది కంటెస్టెంట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తంగా నలుగురు విజేతలుగా ట్రోఫీల్ని గెలుచుకున్నారు. అయితే.. మొదటి ఎపిసోడ్ నుంచి బిగ్ బాస్ పై వస్తున్న విమర్శ ప్రైజ్ లోనే. ఇండియాలో రీజనల్ గా టెలికాస్ట్ అవుతూ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సరిగా అందించడం లేదన్నది చూసిన ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు సీజన్ 4లో ఈ విషయం మరింత తేటతెల్లమైంది. గత మూడు సీజన్లలో విజేతకు 50 లక్షల ప్రైజ్ మనీ అని అనౌన్స్ చేశారు. కానీ.. రన్నరప్ కు మాత్రం సెకండ్ ప్రైజ్ మనీ ప్రకటించడం లేదు.
కష్టపడి ఫైనల్స్ కు వచ్చి రన్నరప్ గా నిలిచినా ప్రైజ్ మనీ లేకుండా రన్నరప్ గా ఎలా పరిగణిస్తారు. క్రికెట్, టెన్నిస్, ఫుట్ బాల్.. ఇలా ఎందులోనైనా సెకండ్ ప్రైజ్ మనీ ఉంటుంది. కానీ.. బిగ్ బాస్ రియాలిటీ షోలో మాత్రం ఉండటం లేదు. పైగా.. ఈసారి 4వ సీజన్ లో జరిగినంత టెన్షన్ మరే సీజన్ లో జరగలేదు. టాప్ 3లో ఉన్న సొహైల్ 25 లక్షలు తీసుకున్నాడు. అయితే.. ఇదంతా మెయిన్ ప్రైజ్ మనీ 50 లక్షల్లో ఇవ్వడం ఏంటో బిగ్ బాస్ కే తెలియాలి. దీంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కు 25 లక్షలు వచ్చాయి. అరియానా 10 లక్షలు తీసుకుని ఉంటే విన్నర్ అభిజిత్ కు 15 లక్షలు వచ్చేవా.. లేక సొహైల్ కు 15 లక్షలు ఆఫర్ చేసేవారా! ఇవేం లెక్కలో బిగ్ బాస్ కే తెలియాలి. టెన్షన్ లేకుండా క్యాష్ తీసుకున్న సొహైల్ కు, టైటిల్ విన్నర్ అభిజిత్ కు మధ్య తేడా లేకపోయింది. ఎలిమినేట్ అయిన మెహబూబ్ కు కూడా చిరంజీవి ద్వారా 10 లక్షలు దక్కాయి.
కానీ.. ఎన్నో ఆశలతో ఫైనల్ కు వచ్చి రన్నరప్ గా నిలిచిన అఖిల్ కు ఏమీ దక్కలేదు. ఫైనలిస్టులుగా నిలిచారంటూ గొప్పగా చెప్పినా.. హారిక, అరియానాకు దక్కింది కూడా ఏమీ లేదు. దీంతో ఈ సీజన్ ప్రైజ్ మనీ విషయంలో పూర్తిగా విమర్శలు వస్తున్నాయి. ఇకనైనా టాప్ 5 ఫైనలిస్టులకు కొంత మొత్తం కేటాయించడం.. రన్నరప్ కు సెకండ్ ప్రైజ్ గా కొంత మొత్తం కేటాయించేలా నిబంధనలు మార్చుకోవాలి. లేకపోతే.. ఎన్నో ఆశలతో వచ్చే కంటెస్టెంట్లకు ఫైనల్స్ లో మరోసారి నిరాశ తప్పదు. మూడు నెలల పాటు బిగ్ బాస్ షో తో ఎంటర్ టైన్ అయిన ప్రేక్షకులకు ఫైనల్స్ లో అసహనం తప్పదు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!