బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మారు మ్రోగింది. దీంతో అందరూ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎలాంటి సినిమా చేస్తాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో.. రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రాంచరణ్లతో `RRR` ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి అంచనాలను మించాడు. అసలు ఇద్దరు భిన్నమైన స్టార్ హీరోలతో దర్శకధీరుడు ఎలాంటి సినిమా చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్న తరుణంలో స్వాతంత్ర్యం రాక మునుపు ఉన్న పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో మూడు వందల కోట్ల బడ్జెట్తో సినిమాను స్టార్ట్ చేసి మరోసారి అందరినీ థ్రిల్ చేశాడు. అసలు రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలను ఒకేసారి తెరపై ఎలా చూద్దామా అని అభిమానులు అతృతగా ఎదురు చూడసాగారు.
ఇలాంటి తరుణంలో వీరిద్దరి పాత్రలపై ఆసక్తికరమైన కథనాలు మొదలయ్యాయి. అవేంటంటే.. ఇద్దరూ ఒకదానికొకటి భిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయనొక బందిపోటు పాత్రలో కనపడబోతున్నారు. పాత్ర కోసం బాడీని భారీగా పెంచుతున్నాడు తారక్. మరో పక్క రాంచరణ్ బ్రిటీష్ వారి దగ్గర పని చేసే పోలీస్ ఆఫీసర్గా కనపడబోతున్నాడు. రీసెంట్గా రాంచరణ్పై రామోజీ ఫిలింసిటీలో ఓ భారీ ఫైట్ను చిత్రీకరించారు. మొదటి షెడ్యూల్లో తారక్, చెర్రీలతో కొన్ని యాక్షన్ పార్టులను తీశారని వార్తలు వినపడుతున్నాయి. అసలు ఈ సినిమా బాహుబలిని మించి ఉంటుందని రీసెంట్గా ఓ కార్యక్రమంలో రాజమౌళి చెప్పడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఒకరేమో పోలీస్ మరొకరేమో దొంగ.. ఇలా వ్యతిరేకమైన పాత్రలు.. వైవిధ్యమైన పాత్రల్లో అభిమానులను మెప్పించనున్నారు. ఈ నెలలోనే కోల్కత్తాలో 40 రోజుల భారీ షెడ్యూల్ జరుగనుంది. ఈ ఏడాదికి చిత్రీకరణను పూర్తి చేసి.. వచ్చే ఏడాదికి అంటే 2020నాటికి సినిమాను విడుదల చేయాలని రాజమౌళి అండ్ టీం భావిస్తున్నారట.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!