Chiranjeevi: తెలుగు చలనచిత్ర రంగంలో స్వయంకృషితో తన టాలెంట్ తో నెంబర్ వన్ గా చిరంజీవి ఎదగటం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా తన కష్టాన్ని నమ్ముకుని మెగాస్టార్ గా అవతరించారు. దాదాపు నాలుగు దశాబ్దాలు టాలీవుడ్ సింహాసనాన్ని ఏలారు. ఆరుపదుల వయసు దాటిన ఏమాత్రం ఈనాటికి జోరు తగ్గకుండా వరుస ప్రాజెక్టులు చేస్తూ సత్తా చాటుతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రైవేటు ఈవెంట్ లలో కూడా పాల్గొంటున్నారు. కొత్త కొత్త నటీనటులను ప్రోత్సహిస్తూ తనవంతు మద్దతు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితంలో కెరియర్ పరంగా ఎత్తు పలాలు ఇంకా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ కూడా హాజరు కావడం జరిగింది. వీరితోపాటు సోషల్ మీడియా వల్ల గుర్తింపు సంపాదించుకున్న ఎంతోమంది హాజరు కావడంతో విజయ్ దేవరకొండ.. చిరంజీవి వ్యక్తిగత జీవితాల అనుభవాలు గురించి అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ క్రమంలో కెరియర్ ప్రారంభంలో ఎన్నడూ మర్చిపోలేని ఓ అవమానకరమైన సంఘటన గురించి చిరంజీవి తెలియజేశారు. “న్యాయం కావాలి” సినిమా షూటింగ్ జరుగుతోంది. రాధికా శారదా జగ్గయ్య వంటి పెద్దవారితో కోర్టు సీన్ చేయాల్సి ఉంది. అప్పుడు నిర్మాత క్రాంతి కుమార్ రోప్ తో మీద ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అయ్యిందని.. చెప్పటంతో నేను వెళ్లి బోనులో నిలుచున్నాను.
దీంతో ఇంత లేటుగా వచ్చానని నిర్మాత అందరి ముందు అరిచారు. ప్రియమైన పెద్ద సూపర్ స్టార్ అనుకుంటున్నావా నీకోసం..ఇంతమంది వెయిట్ చేయాలా అని అందరి ముందు గట్టి కేకలు వేశారు. వందలాదిమంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య నాకు ఏదోలా అనిపించింది. ఆ సంఘటన జరిగిన రోజు మధ్యాహ్నం అన్నం తినబుద్ధి కాలేదు. ఆ ఘటన ఇంకా కళ్ళల్లోనే పెరుగుతున్న సమయంలో నిర్మాత క్రాంతి కుమార్ ఫోన్ చేసి.. శారదా రిల్స్ బాగా తినేస్తుంది. ఆ కోపంతో ఏదో అన్నాను సారీ అన్నారు. కానీ క్రాంతి కుమార్ అన్న మాటల్లో ఓ మాటను మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నా. నువ్వేమైనా పెద్ద స్టార్ అని అనుకుంటున్నావా..? అని అన్నారు కదా..? స్టార్ అయి చూపించాలని చేశాను కసి పెంచుకున్న.. అని వ్యాఖ్యానించారు. దీంతో నన్ను అవమానపరిచిన నిరుత్సాహ పరచాలని చూసిన నాకు పెద్దగా బాధ అనిపించదు. ఎందుకంటే వాటన్నిటిని దాటుకుంటూ వచ్చేసా అంటూ చిరంజీవి సరికొత్త విషయాన్ని తెలియజేశారు.