వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్` విడుదల ఆంధ్రప్రదేశ్లో కావడం లేదు. తెలంగాణలో సినిమా అనుకున్న టైం ప్రకారం నేడే విడుదలవుతుంది. ఆంధ్రపదేశ్లో మాత్రం ఏప్రిల్ 3 వరకు వాయిదా వేశారు. సినిమా ఆంధ్ర ప్రదేశ్లో ఆగిపోవడంపై రాంగోపాల్ వర్మ అండ్ గ్యాంగ్ గుర్రుగానే ఉంది. సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్లీ స్టే ఇవ్వడమేంటని రాంగోపాల్ వర్మ వాదిస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ బోర్డు మెంబర్స్ ఇచ్చిన కట్స్, మ్యూట్ డైలాగ్స్ లిస్ట్ను విడుదల చేశారు. సెన్సార్ అనంతరం సినిమాకు `యు` సర్టిఫికేట్ ఇచ్చారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!