Devatha Serial: ఆదిత్య ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మను హత్తుకుంటాడు.. మన ఇంటికి త్వరలో వారసురాలు వస్తోందని.. మన కష్టాలు అన్ని తీరిపోతాయని.. ఇప్పటివరకు సత్యకు పిల్లలు పుట్టారని అందరూ అన్న మాటలు.. ఇకమీదట నుంచి సత్య పడాల్సిన అవసరం లేదని.. మీరు తాత నాన్నమ్మ అవుతారని ఆదిత్య ఆనందంతో చెప్తాడు..!!
రాధ బిడ్డను ఆదిత్య కు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అంతలో రామ్మూర్తి గారు వచ్చి అమ్మ దేవి, చిన్మయి అని పిలుస్తాడు. త్వరగా కిందికి రండి నాన్న మీకు ఒకటి తీసుకు వచ్చాను అని అంటాడు. అమ్మ రాధ నువ్వు కూడా రా అని పిలుస్తాడు. రాధా రాగానే తన చేతిలో ఉన్న బంగారపు జడకుచ్చులు చూపిస్తాడు. అది చూసిన వాళ్ళ ఆవిడ సంతోషంతో మురిసిపోతుంది. నేనే మీకు పిల్లలకు బంగారం చూపించండి అని చెబుదాం అనుకున్నాను అని అంటుంది. నువ్వు చెప్పకుండానే మనవరాలు ఇద్దరికీ ఏడువారాల నగలు చేయిస్తాను అని అంటాడు రామ్మూర్తి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా పిల్లలకు ఎందుకు అని రాదా అంటుంది.
ఏంటిమ్మ రాధ అలా అంటావు. ఆ ఇద్దరు పిల్లలు మాకు వారసులు. మా వారసులకు నగలు చేయించడంలో తప్పేముంది. నువ్వు మేము వేరుగా మీరు వేరుగా అని అనుకుంటున్నాము. కానీ మేము ఎప్పుడూ అలా అనుకోవటం లేదు. దేవిని చిన్మయి నుంచి దూరం చేయాలని ఎప్పటికీ అనుకోవద్దు. కనీసం మేము బ్రతికి ఉన్నంత వరకు అలా చేయకు అని అంటారు రామ్మూర్తి వాళ్ళు. ఇక మాధవ్ దగ్గరికి వెళ్లిన రాధా దేవి మీ బిడ్డ కాదుగా అని అంటుంది. మాధవ్ కూడా రాధ పై సీరియస్ అవుతాడు. ఇక రాధ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.