తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావుకి టాలీవుడ్లోని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఓ రిక్వెస్ట్ చేశాడు. ఇంతకు ఈ దర్శకుడు చేసిన రిక్వెస్ట్ ఏంటో తెలుసా? యురేనియం కోసం నల్లమల అడవులను నాశనం చేయవద్దని. `నల్లమల ప్రాంతంలో యురేనియం కోసం తవ్వకాలు చేయబోతున్నారు. యురేనియం కోసం నల్లమల అడవులను పాడు చేయకండి. దీని వల్ల పర్యావరణం పాడవుతుంది. చెంచులు ఇతర అటవీ ప్రాంత వాసులు నివసిస్తు్నారు. అంతరించిపోతున్న పులులు నివసిస్తున్న ప్రాంతం. కృష్ణ, దాని ఉప నదులు కలుషితం అవుతాయి. ఇప్పటికే చాలా మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రభుత్వం స్పందించి చెంచులు, ఇతర ఆదివాసులు, పర్యావరణాన్ని కాపాడాలి“ అన్నారు. మరి ఈ స్పందనను ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో చూడాలి.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!