Guntur karam: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” గుంటూరు కారం “. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక ట్రోలింగ్ కి గురవుతుంది.
ఇక ఈ ట్రోలింగ్స్ పై దిల్ రాజు స్పందించినప్పటికీ ట్రోలింగ్స్ మాత్రం ఆగలేదు. ఇక తాజాగా వీటిపై యాక్టర్ అజయ్ ఘోష్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఈయన మాట్లాడుతూ..” కొంతమంది పనిగట్టుకుని కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎందుకో తెలియదు.
కొంతమంది సినిమా చూడని వారు కూడా సినిమా బాగాలేదు.. దొబ్బిందంటా అంటూ నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అలానే ఓ సినిమా అందరికీ నచ్చాలని రూల్ లేదు. నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారికి ఇది పద్ధతి కాదు ” అంటూ చెప్పుకొచ్చారు అజయ్. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!