Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా “గుంటూరు కారం” జనవరి 12వ తారీకు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ తో స్టార్ట్ అయి ఇప్పుడు విజయవంతంగా… ప్రదర్శితమవుతుంది. కలెక్షన్స్ భారీగా వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా కలెక్షన్స్ గురించి సోషల్ మీడియాలో సినిమా యూనిట్ రకరకాల పోస్టులు పెడుతుంది. మహేష్ కెరియర్ లోనే మంచి నెంబర్స్.. “గుంటూరు కారం” కి వస్తున్నట్లు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో “గుంటూరు కారం” సెలబ్రేషన్స్ మహేష్ ఇంటిలో జరుపుకున్నారు. ఈ క్రమంలో మహేష్ తన సోషల్ మీడియా ఎకౌంట్ లో ఫోటోలను షేర్ చేశారు.
ఈ ఫోటోలలో మహేష్ బాబుతో పాటు హీరోయిన్స్ శ్రీలీల, మీనాక్షి చౌదరి నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుతో పాటు నిర్మాత నాగ వంశీ ఉన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ హీరోయిజం..డాన్స్, శ్రీలీల గ్లామర్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మహేష్ బాబు తల్లి పాత్రలో నటించింది. వీరి మధ్య సన్నివేశాలు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇది మూడోసారి చేయటం. “గుంటూరు కారం” సినిమా చేయకముందు అతడు, ఖలేజా సినిమాలు చేయడం జరిగింది. ఆ రెండు సినిమాలు కూడా మొదట నెగటివ్ టాక్ వచ్చింది.
కానీ ఆ తర్వాత టీవీలో విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలకి టీఆర్పీ రేటింగ్ లు భారీగా నమోదు అవుతుంటాయి. “అతడు” మరియు “ఖలేజా” సినిమాలలో మహేష్ బాబునీ… అప్పటివరకు ఎవరూ చూపించని విధంగా త్రివిక్రమ్ చూపించారు. అతడు సినిమాలో పూర్తి సైలెంట్ పాత్రలో కనిపించిన మహేష్ “ఖలేజా”లో తనలో ఉన్న కామెడీ యాంగిల్ చూపించడం జరిగింది. ఇప్పుడు “గుంటూరు కారం”లో ఫుల్ మాస్ పాత్రలో మహేష్ నీ చూపించారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!