`వంగవీటి`ఫేం సందీప్ మాధవ్ (సాండి) లీడ్ రోల్ లో నటించిన మూవీ `జార్జ్ రెడ్డి .. 1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ..విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘‘జార్జ్ రెడ్డి’’ బయోపిక్ గా ఈ సినిమా తెరకెక్కింది..ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తోనే అంచనాలు పెంచిన ఈ చిత్రం నవంబర్ 22న రిలీజైంది. జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి..సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా.. నిర్మాతలు మాట్లాడుతూ కేవలం ఒక్క ట్రైలర్ తోనే మా ‘‘జార్జ్ రెడ్డి’’ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. బిజెనెస్ పరంగా కూడా మాకు మంచి ఆఫర్లు వచ్చాయి.చివరకు ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను అభిషేక్ పిక్చర్స్ -అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు.వారికి థాంక్స్.సినిమా మీద మంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాం.ట్రైలర్ ఏ విధంగా ఇంట్రస్టింగ్ గా ఉందో..సినిమా కూడా దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది.మా దర్శకుడు ఈ సినిమాను రియలిస్టిక్గా తీసాడు.ఎక్కడా రాజీపడకుండా అందరం కష్టపడి ఈ సినిమా తీసాం.బయోపిక్ అయినా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.అలాంటి కథ ఇది. నవంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాం.తప్పకుండా అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!