Samantha: హీరోయిన్ సమంత వ్యక్తిగత జీవితంలో రకరకాల విషయాలు చోటు చేసుకుంటున్నాయి. హీరోయిన్ గా అడుగుపెట్టడమే సంచలనం సృష్టించింది. 2011లో “ఏ మాయ చేసావే” సినిమాతో కెరీర్ ఆరంభించి.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో నటించింది. హీరో నాగచైతన్యానీ ప్రేమించి పెళ్లాడింది. 2017వ సంవత్సరంలో వీరిద్దరి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలకే 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అందరికీ షాక్ కి గురి చేసింది. ఇండస్ట్రీలో ఎంతో చూడముచ్చటగా బెస్ట్ కపుల్ గా ఉన్న వీళ్లు విడాకులు తీసుకోవడం ఎవరు ఊహించలేకపోయారు.
అసలు ఏ కారణంగా ఈ ఇద్దరు విడిపోయారు అన్నది.. వాళ్ళిద్దరికీ తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఒకానొక సమయంలో సోషల్ మీడియాలో వార్తలు వల్ల తమ గురించి కాకుండా వేరే వ్యక్తి గురించి ప్రస్తావన రావడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చినట్లు నాగ చైతన్య తెలిపారు. అయితే సమంత ఇప్పటివరకు విడాకుల గురించి పెద్దగా స్పందించలేదు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా నాగచైతన్యతో.. విడాకుల సందర్భానీ సమంత తాజా పాడ్ కాస్ట్ లో మరోసారి గుర్తు చేసుకున్నారు. సమంత లేటెస్ట్ గా పాడ్ కాస్ట్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మాయోసైటీస్ వ్యాధి నుంచి ఎలా కోలుకోవడం.. ఇంకా అనేక విషయాలు గురించి అనుభవాలు గురించి “టేక్ 20” పేరుతో తెలియజేస్తూ ఉంది. అయితే నాగచైతన్యతో విడాకుల సందర్భాన్ని నటి సమంత తాజా పాడ్ కాస్ట్ లో మరోసారి గుర్తుచేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ… ‘నాకు మయోసైటిస్ రావడానికి ముందు ఏడాదంతా విడాకుల కారణంగా చాలా కష్టంగా గడిచింది. చివరకు ఒకరోజు నాకు శాంతి లభించింది. అప్పుడు నేను, నా మేనేజర్ హిమాంక్ ముంబై నుంచి వస్తున్నాం. చాలా ప్రశాంతంగా, రిలాక్స్డ్ గా ఉన్నానని తనతో అన్నాను. అంతే ఆ తర్వాత నిద్ర లేచేసరికి ఈ అనారోగ్యం దాడి చేసింది’ అని సమంత పేర్కొన్నారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!