Mahesh Babu: సంక్రాంతి బరిలో దిగిన గుంటూరు కారం సినిమాపై దారుణమైన ట్రోల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా త్రివిక్రమ్ పై మాత్రం దారుణంగా విరుచుకుపడుతున్నారు సూపర్ స్టార్ అభిమానులు. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రివిక్రమ్ పై ఇలా ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక దీనిపై స్పందించిన నిర్మాత నాగ వంశి, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. అయినా కూడా ఏదో ఒక కారణంగా గుంటూరు కారం విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక తాజాగా మరోసారి ట్రోలింగ్స్ కి గురైంది గుంటూరు కారం. ఈ సినిమాలో త్రివిక్రమ్ చేసిన అతి పెద్ద తప్పు ఇదేనంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
అదేంటంటే.. ఈ సినిమాలో తల్లి కొడుకులు గా నటించిన రమ్యకృష్ణ, మహేష్ బాబు ల పై ఓ ట్రోలింగ్ నడుస్తుంది. ఒకప్పుడు ఐటమ్ సాంగ్ లో జోడీగా నటించిన వీరిద్దరిని తీసుకొచ్చి ఈ సినిమాలో తల్లి కొడుకులు గా పెట్టడం ఏంటి? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే ఈ సినిమాకి మైనస్ పాయింట్ అయ్యింది అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ వైరల్ చేస్తున్నారు ట్రూలర్స్.
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!