Adi purush : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజే మారిపోయింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ప్రభాస్ ఒకేసారి పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అన్ని చిత్రాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే “సలార్”, “రాధేశ్యామ్”వంటి చిత్రాలు కూడా ఇదే తరహాలో తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ పాన్ ఇండియన్ చిత్రంగా ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతోమంది ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో అలరించనుండగా రాముడికి సీత పాత్రలో కృతిసనన్ నటిస్తోందనీ తాజాగా దర్శకుడు అధికారికంగా ప్రకటించారు.అదే విధంగా రామాయణం తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాముడి పాత్ర ఎంత విలువైనదో అదేవిధంగా లంకేశ్వరుడు పాత్ర కూడా ఎంతో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ సినిమాలో రావణాసుర పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ బదులు ఆ హీరో ఉంటే:
ఆది పురుష్ సినిమాలో రాముడు, రావణాసురుడు పాత్రతో పాటు లక్ష్మణుడి పాత్ర కూడా ఎంతో కీలకమైనది. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో నటించడం కోసం సన్నీ సింగ్ను కన్ఫామ్ చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయితే లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కి బదులుగా విక్కీకౌశల్ లాంటి హీరోను తీసుకుని ఉంటే ప్రభాస్ కి మైనస్ అవుతుందన్న ఉద్దేశంతోనే చిత్రబృందం లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ను కన్ఫామ్ చేసినట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్” ఆది పురుష్” సినిమా ద్వారా తన రేంజ్ మరింత పెరగనుందనే అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా ముంబైలోని ఒక ఫ్లాట్ కొన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఇండియా హీరోగా ఎంతో బిజీగా గడుపుతున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!