Anchor Rashmi: రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్లో పలు సీరియల్స్లోనూ, సినిమాల్లోనూ నటించిన రష్మి.. ప్రముఖ టీవీ షో జబర్దస్త్కి యాంకర్గా మారి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో రష్మి ఫుల్ పాపులర్ అవ్వడానికి ఈ షో ఒక కారణమైతే.. కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్తో ఈమె చేసే ఆన్ స్క్రీన్ రొమాన్స్ మరో కారణంగా చెప్పుకోవచ్చు.
బుల్లితెరపై రష్మి, సుధీర్ల కెమిస్ట్రీ చూసి.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ఇప్పటికే ఎన్నో సార్లు ప్రచారం జరిగింది. అభిమానులు సైతం వీరిద్దరూ ఒకటైతే చూడాలని ఓపెన్గానే చెబుతుంటారు. కానీ, తమకు ఆ ఆలోచన లేదని.. మేము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని తరచూ చెబుతూనే ఉంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికి సంబంధించిన ఆ షాకింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. లాక్ డౌన్ లోనే రష్మి పెళ్లైపోయిందట. ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకుని హైదరాబాద్లో కాపురం పెట్టిందని.. కానీ, ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్గా ఉంచిందని ఆ వార్త సారాంశం. ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్న ఈ వార్త చూసి ఆమె అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.
అసలు ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియక కొందరు సతమతం అవుతుంటే.. మరికొందరు మాత్రం `రష్మీ ఇది టూ మచ్.. అంత పెద్ద రహస్యాన్ని ఇన్నాళ్లు దాచేశావా..?` అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి రష్మికి నిజంగానే పెళ్లైందో..? లేదో..? తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!