కరోనా ఇండస్ట్రీని కోలుకోలేని దెబ్బ తీసింది. ఏ ఒక్క ఇండస్ట్రీ ఇప్పట్లో మళ్ళీ సాధారణ స్థితికి రావడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా వందల కార్మీకులు నమ్ముకొని పనిచేసే సినిమా ఇండస్ట్రీ గురించి అయితే చెప్పడానికి మాటలు రావు. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు నిర్మాత ఎంతో ఖర్చు పెట్టి సినిమాలు నిర్మిస్తుంటాడు. నిర్మాతే లేకపోతే ఏ ఒక్కరు ఉండరన్న సంగతి తెలిసిందే.
ఒక సినిమా రూపుదిద్దుకొని సిల్వర్ స్క్రీన్ మీదకు రావాలంటే అది నిర్మాత వల్లే సాధ్యం అవుతుంది. కాని ఇప్పుడు ఆ నిర్మాత పరిస్థితే గందరగోళంగా మారింది. భారీ బడ్జెట్ తో ఎన్నో మీడియం బడ్జెట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజు. ప్రస్తుతం ఆయన నిర్మాతగా రెండు పెద్ద ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మిస్తున్న “వకీల్ సాబ్” కాగా మరొకటి నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబులు, నివేదా థామస్, అదిరావు హైదరీ హీరో హీరోయిన్స్ గా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వస్తున్న “వి” సినిమా. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ రెండు సినిమాలు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల ఆగిపోయాయి.
ఇప్పటికే వి పూర్తయింది. ఈ నేపథ్యంలో “వి” సినిమాకు పెద్ద ఓటీటీ సంస్థ వారు స్ట్రీమింగ్ చేసేందుకు భారీ ఆఫర్ చేశారట. అయితే దిల్ రాజ్ ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఇక ఈ మధ్య కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజవుతుండటంతో మళ్లీ వి సినిమాకి భారీ ఆఫర్ వచ్చిందట. అయినప్పటికీ దిల్ రాజు ఈసారి కూడా ససేమిరా అన్నారట. వి, వకీల్ సాబ్ సినిమాలను థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు క్లారిటీ ఇచ్చారట. ఇక వకీల్ సాబ్ కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి థియోటర్స్ ఓపెన్ అయ్యాక రిలీజ్ కి సన్నాహాలు చేయనున్నారు.