ప.గో.జిల్లా తాడేపల్లిగూడెం లో మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నేత, మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖా మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు కి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇటీవల పాజిటివ్ నిర్దారణ అయిన మాజి మున్సిపల్ చైర్మన్. బీజేపీ నేత తో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్దారణ అయ్యిందని ఆయన ఓ వీడియోలో తెలిపారు.
అయితే నాకు కరోనా పాజిటివ్ వచ్చింది అని తనేమి భయపడట్లేదు అని… కరోనా సోకితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించండి అని మరియు వీలైనంత వరకు ఇతరులతో కలసి కారులో ప్రయాణించవద్దు అని మాణిక్యాలరావు సూచించారు.