Keerthy Suresh: కీర్తి సురేష్కు ప్రస్తుతం బాగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. `మహానటి` వంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్.. ఆ తర్వాత హిట్టు ముఖమే చూడలేదు. ఈమె నటించిన మిస్ ఇండియా, రంగ్ దే, పెద్దన్న చిత్రాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ `గుడ్ లక్ సఖి`తో ప్రేక్షకులను పలకరించింది.
ఎక్కడో మారుమూల గ్రామీణ యువతి జాతీయ స్థాయి షూటర్గా ఎలా మారిందనేది ఈ సినిమా కథాంశం. అయితే నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైతం ఫ్లాప్ టాక్ను సొంతం చేసుకుంది. దీంతో కీర్తి అకౌంట్లో మరో ఫ్లాప్ వచ్చి పడింది. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ ఆమెకు దండం పెడుతూ ట్రోల్ చేస్తున్నాడు.
ఎందుకంటే, కీర్తి సురేష్ ప్రస్తుతం మహేష్తో పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే కీర్తి బ్యాడ్ టైమ్ వల్ల ఈ చిత్రం కూడా ఎక్కడ ఫ్లాప్ అవుతుందో అన్న కలవరం మహేష్ ఫ్యాన్స్లో మొదలైంది.
అందుకే `నీకో దండం.. నీ సినిమాలకో దండం` అంటూ కీర్తిని మహేష్ ఫ్యాన్స్లో కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఇదెక్కడ గోల రా బాబు.. అసలే వరుస అపజయాలతో కీర్తి సురేష్ బాధపడుతుంటే.. ఇంకా రిలీజే కానీ సినిమా విషయంలో ఆమెను ట్రోల్ చేయడం అవసరమా అంటూ నెటిజన్లు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!