Mamagaru February 19 2024 Episode 139: ఏంటండీ ఇలా జరిగింది ఇప్పుడిప్పుడే కోలుకొని మూడు పూటలా అన్నం తింటున్నాము అనుకొని సంతోషించే లోపే ఇలా జరిగింది అని అంజమ్మ బాధపడుతుంది. మనం నాలుగు డబ్బులు సంపాదిస్తున్నామని దేవుడికి కోపం వచ్చిందేమో అని అందుకే ఇలా చేశాడు అని వెంకటరమణ అంటాడు. ఇంతలో గంగా గంగాధర్ అక్కడికి వస్తారు.అమ్మ పెద్దవాళ్లతో మాట్లాడావా బండి పెట్టుకోడానికి అనుమతిచ్చారా అని అంజమ్మ అడుగుతుంది. లేదమ్మా అని గంగ అంటుంది. మండల ప్రెసిడెంట్ ఇదంతా చేయించాడు మామయ్య అని జరిగిన విషయం అంతా చెబుతాడు గంగాధర్. ప్రెసిడెంట్ గారు మన మీద పగ పెట్టుకున్నాడు ఇక్కడే కాదు ఇంకెక్కడ మనల్ని టిఫిన్ బండి పెట్టుకొ నివడు అని బాధపడతాడు వెంకటరమణ. మీరు అలా బాధపడకండి నాన్న ఏదో ఒకటి ఆలోచిద్దాం అని గంగ అంటుంది. కట్ చేస్తే,
జాబ్ చెయ్యొద్దు అన్నందుకు వసంత బాధపడుతూ ఉంటుంది తిన్నదో లేదో అని సుధాకర్ వసంత కి ఫోన్ చేస్తాడు తన ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది, మళ్లీ వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు సుధాకర్. చెప్పు నాన్న ఏంటి ఫోన్ చేశావు అని దేవమ్మ అడుగుతుంది. అమ్మ వసంత ఫోన్ ఎత్తడం లేదు ఒకసారి వెళ్లి ఫోన్ ఇవ్వవా అని సుధాకర్ అంటాడు. దేవమ్మ వెళ్లి రూమంతా వెతికి ఇక్కడ లేదు నాన్న బయట కూడా లేదు స్నానం చేస్తుందేమో అనుకున్నాను స్నానం దగ్గర కూడా లేదు అని దేవమ్మ అంటుంది. అదేంటమ్మా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్లింది అని సుధాకర్ అంటాడు. కట్ చేస్తే,
గంగాధర్ వాళ్లు వెంకటరమణ టిఫిన్ బండి వేరేచోట అద్దెకి తీసుకొని పెడతారు. ఇక్కడికి వచ్చి మీ టిఫిన్ సెంటర్ ని ఎవరు తీసేయలేరు మామయ్య ఎందుకంటే ఇది ప్రైవేట్ స్థలం అని గంగాధర్ అంటాడు. అద్దె కడుతున్నాం కరెక్టే కానీ ఒక చిన్న లిటిగేషన్ ఉందిరా గంగాధర్ ఈ స్థలం గల ఓనరు చాలా తిండిబోతు టిఫిన్స్ తింటాడు డబ్బులు మాత్రం ఇవ్వడు ఇంటికి కూడా పార్సల్ అడుగుతాడు ఇవ్వకండి అని మహేష్ అంటాడు. పర్వాలేదులే బాబు బండి నడిస్తే చాలు అని వెంకటరమణ అంటాడు. ఇక్కడైనా ఉంచుతాడు లేదంటే తీసేస్తాడు అని అంజమ్మ బాధపడుతూ ఉంటుంది. అమ్మ ఇప్పుడు వేరే చోటకి బండి మార్చాం కదా టెన్షన్ పడకు అన్నీ సవ్యంగానే జరుగుతాయి అని గంగ అంటుంది. ఇంతలో ఒక అతను వచ్చి మీరు టిఫిన్స్ ఇక్కడ పెట్టారా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి అందరూ వస్తారు అంత బాగా చేస్తారు టిఫిన్లు నాకు 20 టిఫిన్ పార్సల్ కట్టండి అని అతను అంటాడు. బాబాయ్ మీరు టిఫిన్ చేయండి పొట్లాలు నేను కడతాను అని మహేష్ అంటాడు. పొట్లాలు కట్టినందుకు నాకు టిఫిన్ పెట్టాలి బాబాయ్ అని మహేష్ అంటాడు. నీ అంత తిండి పోతే ఉండరు రా అని గంగాధర్ అంటాడు. అమ్మ మేము వెళ్లి వస్తాము అంటూ గంగ వాళ్ళు వెళ్లిపోతారు. కట్ చేస్తే,
వసంత ఎక్కడికి వెళ్ళింది అని అందరూ ఇంట్లో టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో గంగ గంగాధర అక్కడికి వస్తారు ఏం జరిగింది అని అడుగుతారు. వసంత ఇంట్లో లేదు అని అంటారు.ఉద్యోగం చేయనీలేదని ఏదైనాఅగత్యం చేసుకుందా అని దేవమ్మ అంటుంది. దేవమ్మ ఎందుకలా మాట్లాడతావ్ ఉద్యోగం చేయలేనంత మాత్రాన తను అలాంటి పని ఏం చేయదు అని చ0గయ్య అంటాడు. అవును అత్తయ్య అక్క అలా ఏమి చేసుకోదు అని శ్రీలక్ష్మి అంటుంది. ఇంతలో వసంత ఇంటికి వస్తుంది. కట్ చేస్తే,
ఎక్కడికి వెళ్లావు వసంత ఇంట్లో చెప్పాలని తెలియదా అని సుధాకర్ అంటాడు. చచ్చిపోతాను అనుకున్నారా అండి అని వసంత అంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో చెప్పి వెళ్లాలి కదా అమ్మ ఇంత నిర్లక్ష్యమా అందుకే కదా ఉద్యోగాలు మానిపించేసింది అని చంగయ్య అంటాడు. ఎంతసేపు ఉద్యోగాలు మానేపించే దాని మీదనే దృష్టి ఉంటుంది కానీ ఉద్యోగం మానేసిన తర్వాత కొన్ని బాధ్యతలు ఉంటాయి మామయ్య గారు మీకేం తెలుసు లాయర్ గా కేసు వాదిస్తున్నాను వాటిని తీసుకువెళ్లి వేరే వాళ్లకు అప్ప చెప్పాలి ఆ కేసు గురించి వాళ్ళకి చెప్పాలి ప్రాసెస్ ఉంటుంది కదా మీరు నన్ను ఆఫీసుకి ఎందుకు తీసుకువెళ్ల లేదండి అలా వెళ్ళిపోతారా అని వసంత అంటుంది. ఉద్యోగం వదిలేగానే బాధ్యత అయిపోదు అవన్నీ వాళ్లకు అప్ప చెప్పాలి ఇంట్లోకి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు గేట్ పాస్ పెట్టండి మామయ్య గారు అంటూ వసంత వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,
వసంత సుధాకర్ బాధని భరిస్తూ కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మౌనంగా పడుకుంటారు. శ్రీ లక్ష్మీ సుధాకర్ కూడా అలాగే బాధలో నిద్రపోతారు. గంగా నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు కానీ నేనే నీకు ఏమీ చేయలేకపోతున్నాను నేను వర్క్ చేయలేను అని వెనకడుగు వేసినప్పుడు సపోర్ట్ చేసి నేను వర్క్ చేసేలా చేసావ్ అలాంటి నీకు ఏ సహాయం చేయలేకపోతున్నాను గంగ అని గంగాధర్ బాధపడతాడు. ఇలా జరుగుతుందని మనకేం తెలుసండి ఉద్యోగాలు చేయాలని ఎంతో పోరాటం చేసి ఉద్యోగులకు వెళ్లాం మామయ్య గారు పెట్టిన షరతుల్లో ఏ ఒక్కరు ఉద్యోగం మానేసిన ముగ్గురం ఉద్యోగం మానేయాలి అన్నది మామయ్య గారి రూలు, గడిచిపోయిన అధ్యాయం ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో ఆలోచిద్దాం అని గంగ అంటుంది. ఇలా జరిగినందుకు వేరే వాళ్లయితే తలుచుకొని బాధపడే వాళ్ళు గంగ నువ్వేంటి ఇంత ఈజీగా మాట్లాడుతున్నావ్ అని గంగాధర్ అంటాడు. నీళ్లలో పడ్డాం బొడ్డుకు వచ్చాం నీళ్లలో పడ్డ దాని గురించి బాధపడితే ఏమొస్తుంది జరిగిపోయిన దాన్ని తలుచుకుంటే తిరిగి వస్తుందా అలా బాధపడితే ముందుకు నడవలేము ఏదైనా పాజిటివ్ గా తీసుకొని బ్రతుకు బండిని నడపాల్సిందే అని గంగ అంటుంది. నువ్వు దేన్నైనా ఇంత ఈజీగా తీసుకుంటావు గంగ నీ అంత తెలివి నాకుంటే మా నాన్న ముందు ఎప్పుడో నిరూపించుకునే వాడిని అని గంగాధర్ అంటాడు. మీరు ఎవరి ముందు నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి చాలు అని గంగ అంటుంది..
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?