Nagarjuna: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలె `బంగార్రాజు` చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటించగా.. కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా మెరిశారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ జనవరి 14న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది.
ప్రస్తుతం సక్సెస్ జోష్లో ఉన్న నాగార్జున.. ట్రెండ్ను ఫాలో అవుతూ తన రూటును మార్చుకుంటున్నారు. ఇప్పటి వరకు సినిమాలు, టీవీ షోలే చేసిన నాగ్.. తర్వలోనే ఓ అదిరిపోయే వెబ్ సిరీస్తో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది.
అయితే ఇప్పుడు థియేటర్స్ తెరుచుకున్నప్పటికీ.. ఓటీటీల జోరు ఏ మాత్రం తగ్గేలేదు. జనాలు కూడా ఓటీటీలకే మొగ్గు చూపడంతో స్టార్ హీరో, హీరోయిన్లు సైతం వాటి వైపే అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున కూడా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కోసం తెరకెక్కబోయే ఓ వెబ్ సిరీస్లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, నాగార్జున ప్రస్తుతం `ది ఘోస్ట్` అనే సినిమా చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటించబోతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.