Nindu Noorella Saavasam: ఆ గుంట నక్క పాప ఫైటింగ్ చేశారా అని అంజలి అడుగుతుంది. ఎవరు గెలిచారు అని ఆకాష్ అంటాడు. ఆ పాపే గెలిచింది తన సామ్రాజ్యాన్ని తన ప్రజల్ని కాపాడుకుంది అని భాగమతి అంటుంది.పాప గెలిచిందని పిల్లలు సంబరపడి చప్పట్లు కొడతారు. గుప్తా గారు మీకు ఈ కథ ఏమైనా అర్థమైందా అని రాథోడ్ అంటాడు. తన కథ తనే చెప్పుకొనుచున్నది అని గుప్తా అనుకుంటాడు. అది సరే మిస్సమ్మ మనోహరి కి డాడీ కి పెళ్లి అవుతుంది ఆపడం ఎలా అని పిల్లలు అడుగుతారు. మనోహరి కి ఆయనకి పెళ్లి జరగనివ్వను ఏ జన్మకైనా సరే ఆ మనోహర్ని ఇంటికి కోడలుగా అడుగుపెట్టనివ్వను మీ అమ్మగా మీకు మాట ఇస్తున్నాను అని భాగమతి. అమ్మేంటి అని రాథోడ్ అంటాడు. నువ్వు మా అమ్మ ఏంటి మిస్సమ్మ అని అంజలి అంటుంది.
కంటేనే అమ్మ వాళ్ళ ప్రేమను పంచితే అమ్మను కాలేనా అని భాగమతి అంటుంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఎలా ఆపుతావు మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు. పీటల దాకా వస్తే పెళ్లి అయిపోయినట్టేనా రాథోడ్ తాళి కడితే పెళ్లవుతుంది ఎలా ఆపుతానో మండపంలో చూద్దురుగాని వెళ్లి రెడీ అయి రండి అని భాగమతి అంటుంది.కట్ చేస్తే,అమ్మగారు అమ్మగారు అంటూ నీలా మనోహరి దగ్గరికి వెళుతుంది. నేను టెన్షన్ పడే విషయమైతే ఇప్పుడు చెప్పకు పెళ్లయిన తర్వాత చెప్పు అని మనోహరరి అంటుంది.ఇప్పుడే వాచ్మెన్ ఇంటి నుంచి ఫోన్ చేశాడమ్మా ఎవరో నీకోసం వెతుక్కుంటూ వచ్చారంట నీకు పెళ్లి ఏంటి అని అడ్రస్ తెలుసుకుని మండపానికి వచ్చారంట అని నీలా చెబుతుంది.నా గతం నన్ను వెతుక్కుంటూ వస్తుందా అని టెన్షన్ పడుతుంది మనోహరి . నీలా నేను చెప్పినట్టు చెయ్యి అని మనోహరి అంటుంది.
కట్ చేస్తే, ఆ రౌడీలు మండపానికి వస్తారు. మనోహర్ని కలవాలి అంటూ లోపలికి వెళ్తూ ఉండగా ఎవరు మీరు అని శివరామ్ అడుగుతాడు. మనోహరి ని కలవాలి అని వాళ్ళుఅంటారు.మనోహరి కి మీరు ఏమవుతారు అని శివరా అంటాడు.మనోహరి కి మేము బంధువులం మేము వస్తున్నట్లు తనకి తెలియదు సర్ప్రైజ్ ఇస్తాం మనోహరి ఏ గదిలో ఉందో చెప్పండి అని అతను అడుగుతాడు. ఆ గదిలో ఉంది వెళ్ళండి అని శివరామ్ చెప్పగానే అతను వెళుతూ ఉంటాడు అతను వెళుతూ ఉండగా అమరేంద్ర చూసుకోకుండా అతను గుద్దేస్తాడు. సారీ అంటూ అమరేంద్ర వెళ్ళిపోతాడు. కట్ చేస్తే, అతను మనోహరి రూమ్ లోకి వెళ్ళేసరికి నీలా పెళ్లి కూతురు గెటప్ లో ఉంటుంది. ఎవరయ్యా నువ్వు అని నీలా అడుగుతుంది. మనోహరి కోసం వచ్చాను నువ్వు ఎవరు అని అతను అడుగుతాడు.నేనే మనోహర్ని ఎవరు మీరు ఏం కావాలి అని నీలా అంటుంది. నువ్వు మనోహరా అని అతను అంటాడు.
అవును నేనే మనోహరి ని నువ్వు వెళ్తే నేను రెడీ అవ్వాలి వెళ్ళు అని అతని బయటికి పంపించి నీలా డోర్ పెడుతుంది. అతను వెళ్ళిపోయి ఇక్కడ ఏదో తప్పు జరుగుతుంది పెళ్ళేదాకా ఇక్కడే ఉందాం అని అతను అంటాడు. కట్ చేస్తే, భాగమతి పిల్లల్ని తీసుకొని పెళ్లి మండపానికి వస్తుంది. పిల్లల్ని తీసుకొని లోపలికి వెళుతూ ఉండగా మండపం లోపలికి అరుంధతి వెళ్లలేక భాగమతి ఒంట్లో నుంచి బయటికి వచ్చేస్తుంది. భాగమతి మంటపంలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి గుప్తా గారు నేను లోపలికి వెళ్లలేక పోతున్నాను అని అరుంధతి అడుగుతుంది. అఘోర నీవు లోపలికి పోరాకుండా రక్షణ రేఖ గీశాడు అని గుప్తా చెబుతాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్లలేనా అని అరుంధతి అడుగు వెయ్యబోగానే మంటలు వచ్చి తను వెనకకి అడుగేస్తుంది. కట్ చేస్తే, ఆ ఆత్మ నేని గీసిన గీతను దాటి లోపలికి రాలేదు నువ్వు ధైర్యంగా పెళ్లి పీటల మీద కూర్చో అని ఘోర అంటాడు. పెళ్లి దగ్గర పడుతున్న కొద్ది నాకు టెన్షన్ మొదలవుతుంది అని మనోహరి అంటుంది.
ఎన్నో రోజుల నుంచి కంటున్న కల కదా కలగానే మిగిలిపోతుందనే టెన్షన్ పడుతున్నావ్ అంతే నీ పెళ్లి ఎవరు ఆపలేరు ధైర్యంగా పెళ్లి చేసుకో అని ఘోర అంటాడు. పెళ్లిని నేను ఖచ్చితంగా ఆపుతాను గుప్తా గారు ఎలాగైనా నేను లోపలికి వెళ్ళాలి అని అరుంధతి అంటుంది. నీవు పెళ్లి ఆపుతానని ప్రగల్బాల్ పలికి బాలిక వంట్లోకి ప్రవేశించి పిల్లల దగ్గర ప్రమాణం చేశావు ఇప్పుడు చూడు ఆ బాలిక నీవల్ల ఇక్కడ ఇరుక్కుంది అనే గుప్తా అంటాడు. ఏదో ఒకటి చేసి ఈ గీతని చెరిపేయండి గుప్తా గారు అని అరుంధతి అంటుంది.
ఈ గీత ఇక్కడ ఉండుట విధి లికితము దానిని చెడిపి నేను అపరాధము చేయను అని గుప్తా అంటాడు. భాగమతి పెళ్లి మండపంలో నేనెందుకు ఉన్నాను అని దిక్కులు చూస్తుంది. ఆయన పెళ్లి మండపానికి నేను వచ్చాను అంటూ అంత తిరుగుతుంది భాగమతి.మిస్సమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావ్ మనకు టైం లేదు అని పిల్లలు అంటారు.అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది