ఇండియన్ `బాహుబలి` ప్రభాస్ రేంజ్ ఖండాంతరాలు దాటింది. ఆయన తదుపరి చిత్రం `సాహో` గురించి సినీ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. ఈ అభిమానుల లిస్టులో పాకిస్థాన్ హీరోయిన్ మవ్రా హొకెన్ కూడా చేరింది. ఈమె ఎవరు? అనే సందేహం రావచ్చు. ఈమె పాకిస్థాన్ వర్ధమాన నటి. రీసెంట్గా `సాహో` నుండి విడుదలైన `సయ్యా సైకో` పాటను ఈమె హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్వట్టర్లో పోస్ట్ చేయడమే కాదు.. ప్రభాస్ అంటూ మెసేజ్ కూడా పెట్టింది. దీంతో పాకిస్థాన్లో ప్రభాస్ అభిమానులు.. అది కూడా సినీ సెలబ్రిటీలున్నారనే సంగతి తెలిసొచ్చింది. సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న `సాహో` ఆగస్ట్ 15న విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ హీరోయిన్గానటించింది.
previous post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!