F3: సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ త్రీ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్, మెహరీన్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సినిమా స్టార్టింగ్ నుండి ప్రమోషన్ వరకు అన్నీ కూడా కామెడీ తరహాలో అనిల్ రావిపూడి తనదైన శైలిలో ముందుండి నడిపిస్తున్నారు. సినిమాకి సంబంధించి రిలీజ్ వేడుక కూడా మొత్తం అంతా కామెడీ మాయమవటం తెలిసిందే. అదే విధంగా పలు యాంకర్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలో కూడా.. డైరెక్టర్ హీరోలు కామెడీ పండిస్తున్నారు. డబ్బు తో కూడిన డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. తెరకెక్కిన “ఎఫ్ త్రీ” సినిమా లో… రేచీకటి ఉన్న వ్యక్తిగా హీరో వెంకటేష్ తో పాటు నత్తి ఉన్నవాడిగా వరుణ్ తేజ్ కనిపించనున్నారు.
సునీల్ కూడా ఈ సినిమాలో మొదటి నుండి చివరి వరకు కనిపించనున్నారు. అయితే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాల్లో స్త్రీ నిర్మాత దిల్ రాజు విజయవాడలో కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్ ధరలను పెంచే ఆలోచన లేదని పునరుద్ఘాటించారు. అదే రీతిలో సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు మరి కొంతమంది పెద్ద హీరోలతో ఓ ఎపిసోడ్ వుంటుందని స్పష్టం చేశారు. దీంతో దిల్ రాజు కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!