BRO: మంగళవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో “BRO” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. మెగా అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి మెగా హీరోలు ఈ సినిమాలో నటించిన పవన్ కళ్యాణ్, సాయి దారమ్ తేజ్ రావటం జరిగింది. వీళ్ళతోపాటు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ కూడా వచ్చారు. ఇంకా సినిమా యూనిట్ రావడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో భాగంగా తమిళ చలనచిత్ర రంగంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీ పరిశ్రమలో మనవాళ్లే చెయ్యాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలన్నారు. ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఈ రీతిగా ముందుకెళ్లడానికి ప్రధాన కారణం అందరిని కలుపుకుని వెళ్లే విధానం అన్నారు.
చాలామందికి టాలీవుడ్ ఇండస్ట్రీ అన్నం పెట్టింది. తమిళ పరిశ్రమ వాళ్ళు కేవలం తమిళ వారికే అవకాశాలు.. అంటే ఎదగదు అన్నారు. అన్ని పరిశ్రమలకు సంబంధించిన వారిని తీసుకుంటేనే పరిశ్రమ ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీ ఇలా వారిని.. కలుపుకుపోయి అద్భుతమైన సినిమాలు తీస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదే రీతిలో తమిళ ఇండస్ట్రీ అయితే ముందుకెళ్తూ RRR లాంటి సినిమాలు చేయాలని పేర్కొన్నారు.
పరిశ్రమలు మరింత విస్తృతం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఒక రోజా సినిమా వచ్చిందంటే దానికి కారణం ఏఏం రత్నం. ఆయన తెలుగువారు.. ఆయన తీసిన రోజా ఇంకా జెంటిల్మెన్ సినిమాలు తమిళ ఇండస్ట్రీకి మంచి పేరును తీసుకొచ్చాయి. ఆర్టిస్ట్ కి కులం, మతం, ప్రాంతం అంటే పరిశ్రమ ఎదగదన్నారు. సినిమా రంగంలో ఖచ్చితంగా పోటీ ఉండాలి అదేవిధంగా అందరిని కలుపుకుని ముందుకెళ్లాలని సూచించారు. ఏమైనా కార్మిక సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పరిదులు దాటి ఎదగాలని పవన్ తన స్పీచ్ ఇచ్చారు. దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలు దక్షిణాది చలనచిత్ర రంగంలో సంచలనంగా మారాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!