Vijayawada: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కొండ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. గత రాత్రి నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి విజయవాడలో కొండచరియలు విరిగిపడ్డాయి.
లబ్బీపేటలోని కస్తూరిబాయి పేట ప్రాంతంలో కొండ చరియలు విరి ఇళ్లపై పడటంతో నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అయాలు అయినట్లు తెలుస్తొంది. ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్ రోడ్ మీద పడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారుల ఆ మార్గంలో టోల్ గేట్ ను మూసివేశారు. భక్తులను మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు. ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ద ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మణిపూర్ అంశంపై విపక్షాల ఆందోళనను తప్పుబట్టిన విజయసాయి