ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివపార్వతి ఇటివల ‘వదినమ్మ’ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఇటివల శివపార్వతి కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె పది రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో వదినమ్మ సీరియల్ దర్శకుడు ప్రభాకర్, నిర్మాత శివ కుమార్ పై ఆరోపణలు చేశారు.
ఆపత్కాలంలో నన్నెవరూ పట్టించుకోలేదు..
సీరియల్ లో నటిస్తున్నప్పుడు అభిమానంగా చూసిన నిర్మాత, దర్శకుడు తనకు కరోనా సోకిన తర్వాత తన ఆరోగ్యం గురించి కనీసం ఆరా తీయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ లో నటించామా.. వచ్చామా అన్నట్టు మాత్రమే ఉండాలని ఈ కష్ట కాలంలో తెలుసుకున్నానని ఆమె అన్నారు. నటులకు కష్టకాలంలో తోడుంతే వారు మరింత ధైర్యంగా ఉంటారని.. తనకు వదినమ్మ సీరియల్ టీమ్ నుంచి అటువంటి ధైర్యం, భరోసా రాలేదని ప్రభాకర్, శివ కుమార్ పై ఆరోపణలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో నటుడు, దర్శకుడు ప్రభాకర్ ఈ విషయమై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
శివపార్వతి అపార్ధం చేసుకున్నారు అంతే..
‘శివపార్వతి అమ్మ చేసిన ఆరోపణల్లో నిజం లేదు. ఇదంతా చిన్న మిస్ కమ్యునికేషన్ లో జరిగింది. శివపార్వతి గారు కరోనా బారిన పడినప్పటి నుంచీ ఆమె కుమారుడితో మేము టచ్ లోనే ఉన్నాం. ఆమె యోగ క్షేమాలు తెలుసుకుంటూనే ఉన్నాం. అనారోగ్యంగా ఉండటంతో ఆమె మాకు అందుబాటులోకి రాలేదు. చికిత్స సమయంలో ఇదంతా ఆమెకు తెలియక పోవడం వల్లే ఇలా జరిగింది. ఆమె నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేశారు. ఇదంతా నాకు తెలీకుండా జరిగిపోయింది. వదినమ్మ గ్రూప్ లో ఈ వీడియో పెడితే ఎవరు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారో తెలీదు. నేను మరో వీడియో చేస్తాను అన్నారు. మీరు కోలుకోండి అన్నీ సవ్యంగా జరుగుతాయి అని చెప్పాం. ఆమెకు అండగా ఉంటాం. ఈ సమయంలో ఆమెకు సాయం చేసిన శివబాలాజీ, రాజశేఖర్, జీవిత గారికి కృతజ్ఞతలు’ అని ప్రభాకర్ వివరణ ఇచ్చారు. ఈ వీడియోను ప్రభాకర్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
https://www.facebook.com/tvmegastar/videos/333616031150789/
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!