Prabhas: తెలుగు చలనచిత్ర రంగంలో ఎటువంటి కల్మషం లేని హీరోలలో మొదటి వరుసలో ఉండేది ప్రభాస్. దీంతో మనవడు అంటే చాలామంది హీరోలకు దర్శకులకు హృదయపూర్వకంగా ఇష్టపడతారు. తమ సినిమాతో పాటు ప్రభాస్ సినిమా కూడా విజయం సాధించాలి అన్నట్టుగా కోరుకుంటారు. తనతో పాటు ఎదుట వ్యక్తి మంచి క్షేమాన్ని కోరుకునే వ్యక్తిత్వం ఉన్న హీరో ప్రభాస్ అని తోటి హీరోలు చెబుతుంటారు. ఈ రకంగానే ప్రభాస్ స్నేహితుల విషయంలో తోటి హీరోల.. విషయంలో అదే విధంగా అభిమానుల విషయంలో కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. తాను ఎక్కడ ఉన్నా పండగ వాతావరణం క్రియేట్ చేస్తాడు. ఆతిథ్యం ఇవ్వటంలో ఎప్పుడూ కూడా ముందుంటాడు.
పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన సమయంలో మొగల్తూరులో అభిమానులందరికీ రకరకాల వంటకాలతో భోజనాలు పెట్టించడం జరిగింది. అటువంటి ప్రభాస్ “బాహుబలి” సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాక చాలా బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ వచ్చాక సరేనా హిట్ పడలేదు. ప్రస్తుతం “ఆదిపురుష్” సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రాబోతున్నాడు. జూన్ 16వ తారీకు ఈ సినిమా రిలీజ్ బాగుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ తాజాగా తన అభిమాని చివరి కోరిక తీర్చడం జరిగింది.
పూర్తి విషయంలోకి వెళ్తే ప్రభాస్ వీరాభిమాని రంజిత్ మరణాంతరం అతనికి కుటుంబం గుడి కట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సీపట్నంలో జరిగింది. రంజిత్ ఆరుదైన వ్యాధితో బాధపడుతుండగా… ప్రభాస్ ని కలవాలనే కోరికను అతని తల్లి తీర్చడం జరిగింది. ఇటీవల రంజిత్ విషయం తెలుసుకున్న ప్రభాస్ వెంటనే.. సల్లార్ సెట్స్ కి పిలిపించుకున్నాడు. అతనితో కాసేపు అక్కడ గడిపి తర్వాత ప్రభాస్ స్వయంగా మంచూరియా చికెన్ వంటకం అతనికి వడ్డించి అన్నం పెట్టే తన ఇంటి వద్ద గడపటం జరిగింది. చివరిలో రంజిత్ వెలిపోతుండగా “బాహుబలి” సినిమాలో… ఉపయోగించిన కత్తిని రంజిత్ కి బహుమతిగా ప్రభాస్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు రంజిత తల్లి.. తెలియజేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో రావటంతో… దటీజ్ ప్రభాస్ అని అభిమానులు పొగుడుతున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!