Prabhas : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పోలిశెట్టి తాజాగా నటిస్తున్న చిత్రం “జాతి రత్నాలు”.అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేసింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో సెక్యూరిటీ గార్డ్ తో, గొడవ పడుతూ లిఫ్ట్ లో అంత్యాక్షరి ఆడుతూ ఎంతో హంగామా చేస్తున్నారు ఈ చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం ముంబై వెళ్లిన ఈ టీమ్ ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు.
ఈ వీడియోలో ప్రభాస్ ఇంటి ముందు జాతి రత్నాలు టీమ్ ప్రభాస్ అన్నను కలవాలి అనగా అందుకు సెక్యూరిటీ గార్డు ఒప్పుకోడు. దీంతో అతనితో సరదాగా గొడవకు దిగి లోపలికి ప్రవేశిస్తారు. అయితే ప్రభాస్ ఇంట్లో మడత మంచం వేసి ఉంటుంది. అరె ప్రభాస్ అన్న వస్తుంటే మడత మంచాలు ఏందిరా,మంచి సోఫా సెట్ వేయ్యండి అంటూ హీరో నవీన్ పోలిశెట్టి అక్కడున్న వారికి ఆర్డర్ వేస్తున్నట్లు నటిస్తారు.తనకు ప్రభాస్ తెలియకపోయినా తెలిసినట్టు ఎంతో బిల్డప్ కొడుతూ ఏదో నెంబర్ కి కాల్ చేసి తనకు డార్లింగ్ తెలుసని, చిన్నప్పట్నుంచి వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ గురించి చెబుతున్న సమయంలో వెనకనుంచి ప్రభాస్ వారిపై చేయి వేయడంతో కంగుతిన్న నవీన్”ప్రభాస్ తో అన్నా ఒక సెల్ఫీ ప్లీజ్”అని అడిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఏంటి హీరోయిన్ నాకన్నా అంత పొడువుంది:
ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయడానికి వచ్చిన ప్రభాస్ సినిమాలో నటించిన హీరోయిన్ ఫరియా అబ్దుల్లాను చూసి ఈ హీరోయిన్ ఏంటి? నాకన్నా అంత పొడువు ఉంది? హీల్ వేసుకోలేదు కదా… అంటూ ఆమెని ఎంతో ఆశ్చర్యంగా అడగడం అందరినీ ఆకట్టుకుంది. అయితే బాహుబలి చేతులమీదుగా 4:20 గంటలకు జాతిరత్నాలు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే జాతిరత్నాలు ట్రైలర్ చూసిన ప్రభాస్ ఎంతో అద్భుతంగా ఉందని, కొంతసేపటికే ఎంతగానో నవ్వుకున్నాను, సినిమా మొత్తం చూస్తే కడుపుబ్బ నవ్వుతారు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
స్వప్న సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!