Pulkit Samrat: 2024 లో అనేక వెండితెర జంటలు వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా మరో బాలీవుడ్ జంట పెళ్లికి రెడీ అయింది. తమ అభిమానులను మరియు అనుచరులను ఆశ్చర్యపరిస్తూ.. తాజాగా పుల్కిత్ సామ్రాట్ మరియు కృతి ఖర్బందా మార్చ్ నెలలో తమ వివాహాన్ని ప్రకటించారు.
దీంతో వీరిద్దరి అభిమానులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇప్పటివరకు లవ్ అనే రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరూ మరికొన్ని రోజుల్లో పెళ్లి అనే బంధం లోకి వెళ్ళనున్నారు. గత కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్న వీరిద్దరూ కలిసి మనేసర్లోని ఐటిసీ గ్రాండ్ లో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. పుల్కిట్ మరియు కుర్తి కుటుంబాలు వీరి వివాహాన్ని అంగీకరించి వీరిని ఆశీర్వదించేందుకు హాజరవ్వనున్నారు.
వీరిద్దరి వివాహం మరియు రిసెప్షన్ ముంబైలో నిర్వహించడం లేదని ఢిల్లీలో కేవలం 3 వేడుకలు మాత్రమే ఉండనున్నట్లు తెలుస్తుంది. మెహందీ, హెల్ది, సంగీత్ మరియు వివాహం. ఇవి మాత్రమే వీరి వివాహంలో ఉన్నాయి. అదేవిధంగా సినీ పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వీరి వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. కొన్ని దశాబ్దాల పాటు పుల్కిత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఇప్పటికే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక వీరి వివాహం గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?