Breaking: ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలే కాదు బుల్లితెర జంటలు సైతం ప్రేమించుకుంటూ పెళ్లి బంధానికి నోచుకుంటున్న సంగతి తెలిసిందే. 2024లో అనేక వివాహాలు జరిగాయి. వీటిలో సినీ ఇండస్ట్రీకి చెందినవారు కొందరైతే బుల్లితెర సీరియల్స్ కి చెందినవారు మరికొందరు. వరుస పెట్టి వివాహాలు చేసుకుంటూ దాంపత్య జీవితానికి నోచుకుంటున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటేనే భయపడే వారంతా ప్రస్తుతం పెళ్లిపై మొగ్గు చూపుతున్నారు.
అలా కొందరు హీరో మరియు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుంటే మరికొందరు మాత్రం విడిపోతూ తమ అభిమానులకి షాక్ ఇస్తున్నారు. ఏదేమైనప్పటికీ వెండితెరపై కనిపించి ప్రేమలో పడ్డ జంటల బంధం ఎక్కువ కాలం నిలబడుతుందో లేదో చెప్పలేము కానీ బుల్లితెరపై ఉన్న ప్రేమ జంటల బంధం మాత్రం చాలా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. బుల్లితెరపై ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుని ఇప్పటికి కూడా తమ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకున్న వారు ఈ ఎందరో ఉన్నారు.
ఇక తాజాగా మరో బుల్లితెర జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. ఆ జంట మరేదో కాదు యష్, వేద. ఇది వాళ్ళ అసలు పేర్లు కాకపోయినా సీరియల్స్ లో ఈ క్యారెక్టర్లలోనే వీరిద్దరూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వీరిద్దరి అసలు పేర్లు నిరంజన్, దేబ్జానీ మోదక్. వీరిద్దరూ బుల్లితెరపై అనేక సీరియల్స్ లో నటించి మంచి పేరు ప్రఖ్యాతాలను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సత్యభామ అనే ఓ సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా వీరిద్దరూ దండలు మార్చుకుంటున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి చూసిన వారంతా వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ అనుకుంటున్నారు. నిజానికి ఇది వీరిద్దరూ కేవలం ప్రేక్షకుల ఆనందం కోసమే చేసినట్లు తెలుస్తుంది. ఓ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరకు వెళ్లిన వీరిద్దరూ వారి కోరికను నెరవేర్చేందుకు ఈ పని చేశారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన కొందరు..” నిజంగా ఇదే కనుక నిజం అయితే ఎంత బాగుంటుందో? వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!