Pushpa: కొన్ని సినిమాలు ఫ్లాప్ టాక్తో మొదలై సుపర్ హిట్ అందుకుంటాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్తో మొదలై ఇండస్ట్రీ హిట్ సాధిస్తాయి. అలాంటి జాబితాలో నిలిచింది పుష్ప: ది రైజ్ పార్ట్ 1. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ – మూత్తం శెట్టి మీడియా కలిసి నిర్మించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేశారు. అయితే మొదటి రోజు ఈ సినిమాకు కొంత డివైడ్ టాక్ వచ్చింది. కొంతమంది ఫ్లాప్ అని కూడా చెప్పుకున్నారు. అభిమానులు మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేశారు.
అయితే ఇప్పుడు పుష్ప వసూళ్ళు రికార్డ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించాయి. ‘పుష్ప: ది రైజ్’ మొదటి మూడు రోజుల్లోనే రూ. 173 కోట్లు రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాషల్లో ఓవర్సీస్లోనూ ఈ సినిమా దూసుకెళుతుందని చిత్రబృందం తెలిపింది. ఇక తాజాగా ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యే సరికి వరల్డ్ వైడ్గా పుష్ప సినిమా రూ. 229 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాద్వా ఓ పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా వెల్లడించడం విశేషం. అసలు ఇంత భారీ స్థాయి వసూళ్ళు రాబడుతుంది అని మేకర్స్ కూడా ఊహించనిది.
Pushpa: సుకుమార్, అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్స్గా మారిపోయారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత స్పెషల్ సాంగ్లో కనిపించింది. దేవీశీప్రసాద్ సంగీతం సినిమాకు మైనస్ అనే టాక్తోనే సూపర్ క్రేజ్ తెచ్చాడు. కాగా, ఈ సినిమాకు సీక్వెల్గా పుష్ప పార్ట్ 2ను వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రారంభం కానుంది. అల్లు అర్జున్ – రష్మిక మందన్నలతో పాటు పార్ట్ 1లో నటించిన కీలక పాత్రలు పోషించిన వారందరూ సీక్వెల్లోనూ కంటిన్యూ అవుతున్నారు. అన్ని అనుకున్నట్టు పూర్తైతే వచ్చే ఏడాది చివరిలో ఇదే డిసెంబర్ నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో సుకుమార్, అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్స్గా మారిపోయారు. మేకర్స్ కూడా మొదటి పాన్ ఇండియన్ సినిమాను నిర్మించి సక్సెస్ అందుకున్నారు.