సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా రాణించడం కోసం రజినీకాంత్ మెల్లమెల్లగా ప్రజలకు దగ్గరయ్యే అవకాశాలు వచ్చిన క్రమంలో వేటిని వదులుకోవడం లేదు. దీనిలో భాగంగా ఇటీవల కరోనా వైరస్ పాజిటివ్ అని వచ్చిన రజనీకాంత్ వీరాభిమాని మురళి… సోషల్ మీడియాలో వీడియో రికార్డింగ్ చేశారు. మీ సారథ్యంలో మీ నాయకత్వంలో పని చేయాలని కోరుకుంటున్నాను కానీ నడవలేక పోతున్నాను అందుకు ప్రస్తుతం బాధగా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ వీడియో చిత్రీకరించారు.
అది కాస్త వైరల్ కావడంతో రజినీకాంత్ దాకా రావడంతో ఆయన స్పందించారు. స్వయంగా రజినీకాంత్ తన వాయిస్ మెసేజ్ రికార్డు చేస్తూ మురళికి ధైర్యం చెబుతూ మనో ధైర్యాన్ని నింపారు. రజనీ తన వాయిస్ మెసేజ్ లో మాట్లాడుతూ… . ధైర్యం కోల్పోకు నీకు ఎటువంటి అపాయం జరగదని అన్నారు. నువ్వు కోలుకున్న తర్వాత పూర్తి ఆరోగ్యవంతుడు అయిన తర్వాత కుటుంబంతో కలిసి మా ఇంటికి రావాలి అంటూ ఆహ్వానించారు. మురళికి జీవితంపై కొండంత ధైర్యం చెబుతూ ఆశలు కల్పించారు.
వాయిస్ మెసేజ్ లో చాలా వరకు రజినీకాంత్ మనో ధైర్యం నింపే విధంగా మాట్లాడటంతో ఆవు వాయిస్ మెసేజ్ సోషల్ మీడియాలో కూడా రావడంతో వైరల్ కావటంతో కచ్చితంగా మహమ్మారిని మురళి జయించి బయటకొస్తారని నెటిజన్ల తో పాటు రజనీకాంత్ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా తన కోసం రజనీకాంత్ స్వయంగా వాయిస్ మెసేజ్ రికార్డింగ్ చేయటంతో మురళి ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారట.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!