టాలీవుడ్ లో రీసెంట్ గా ఓ వార్త వైరల్ అయింది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్టు ఓకే చేశాడనేది ఆ వార్త. ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన సబ్జెక్టుకు రామ్ చరణ్ ఫిదా అయ్యాడని దీంతో వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. నిజానికి ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ లేకపోయినా బాగా వైరల్ అయింది.
అయితే.. ఈ వార్తలో నిజం లేదంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్.. ఆ తర్వాత తండ్రి సినిమా ఆచార్యలో చేస్తున్నాడని.. ఈ సినిమాల తర్వాత చేయబోయే ప్రాజెక్ట్ ఏదీ రామ్ చరణ్ యాక్సెప్ట్ చేయలేదని అంటున్నారు. వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేశ్ తో వేరే స్క్రిప్టు పనుల్లో ఉన్నాడని అంటున్నారు. మహేశ్ ఓన్ బ్యానర్ లో చేయబోయే ఓ సినిమాకు వర్క్ చేస్తున్నాడని అంటున్నారు. అలాగే.. సర్కారు వారి పాట పూర్తయ్యేలోపు వేరే సబ్జెక్ట్ రెడీ చేయాలని కూడా వంశీకి చెప్పాడని అంటున్నారు. రీసెంట్ గా వంశీ చెప్పిన కథను మహేశ్ రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తో వంశీ నిజంగా సినిమా చేయాలంటే ప్రస్తుతం మహేశ్ కు చెప్పే చేయాలంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలన్నీ ఇండస్ట్రీలో గాసిప్స్ గా రౌండ్ అవుతున్నాయి. మరి నిజానిజాలేంటో వీరిలో ఎవరొకరు రివీల్ చేయాల్సిందే.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!