Rashmika mandanna: పాన్ ఇండియన్ సినిమాగా వచ్చి మాస్ హిట్ అని టాక్ తెచ్చుకున్న లేటెస్ట్ సినిమా పుష్ప: ది రైజ్ పార్ట్ 1. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మోస్ట్ వాంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్లో నర్తించింది. పుష్ప రాజ్గా అల్లు అర్జున్ ఎంత మాసీగా కనిపించాడో శ్రీవల్లిగా రష్మిక మందన్న అంతే మాసీవ్ పాత్రలో కనిపించింది. ఆమె కెరీర్లో ఇప్పటి వరకు రష్మిక మందన్న ఇంత మాస్ రోల్ చేసింది ఇదే మొదటిసారి. ఆమె పాత్రను పరిచయం చేసినప్పటి నుంచి శ్రీవల్లి సాంగ్, ఆ తర్వాత సామీ సామి సాంగ్స్ ఆమెకు బాగా క్రేజ్ తీసుకువచ్చాయి.
అయితే సమంత సాంగ్ ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా వచ్చిన తర్వాత రష్మిక సాంగ్స్ కాస్త సౌండ్ తగ్గాయి. అంతేకాదు అందరూ పుష్ప సినిమాలో సమంత సాంగే హైలెట్ అవుతుందని, దీనివల్ల రష్మికకు బాగానే డ్యామేజ్ అవుతుందని చెప్పుకున్నారు. కానీ పుష్ప రిలీజయ్యాక సమంత సాంగ్ తేలిపోయిందనే టాక్ వచ్చింది. అందరు ఆశించిన స్థాయిలో సమంత సాంగ్ లేదని టాక్ వచ్చింది. సమంత వల్ల రష్మిక కు మైనస్ అవుతుందనుకున్న వారికి అసలు విషయం సినిమా రిలీజైతే గానీ తెలీలేదు. ఇప్పుడు ఎక్కడ చూసిన రష్మిక చేసిన సామీ సామీ సాంగ్ గురుంచే మాట్లాడుతున్నారు.
Rashmika mandanna: రష్మిక కూడా నో అనకుండా ఏ ఈవెంట్లో అయినా ఆమె సిగ్నేచర్ స్టెప్ వేసి అలరిస్తోంది.
సినిమా రిలీజ్కు ముందు ప్రమోషన్స్ కోసం ఎక్కడికెళ్ళినా అభిమానులు రష్మికను సామీ సామీ సాంగ్లోని స్టెప్ వేయమని అడిగారు. ఇప్పుడు సక్సెస్ మీట్ కోసం వెళితే కూడా అదే అడుగుతున్నారు. దాంతో రష్మిక కూడా నో అనకుండా ఏ ఈవెంట్లో అయినా ఆమె సిగ్నేచర్ స్టెప్ వేసి అలరిస్తోంది. ఇప్పుడు మాస్ ఆడియన్స్కు ఇది బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు ఇప్పటికే కొందరు ఈ సాంగ్ను పేరడీ చేసి యూట్యూబ్స్లో పెడుతున్నారు. అంతగా ఇప్పుడు రష్మిక మందన్న సామీ సామీ సాంగ్ ట్రెండ్ అవుతోంది. ఇక పుష్ప వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నెగిటివ్ పబ్లిసిటీ కూడా పుష్పకు ప్లస్ అయింది.